amp pages | Sakshi

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు!

Published on Sat, 09/25/2021 - 16:45

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ–ప్రతివ్యూహాలు, ఆరోపణలు–ప్రత్యారోపణలు, సవాళ్లు–ప్రతిసవాళ్లలో నిమగ్నమయ్యాయి. డ్రగ్స్‌ ఆరోపణలు మొదలు వైట్‌ చాలెంజ్‌లు, చివరకు కోర్టులను ఆశ్రయించే వరకు పరిస్థితులు చేరుకున్నాయి. ట్విట్టర్‌ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానాలూ పెరిగిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయమున్నా అన్ని పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పాదయాత్రలు, జాతీయస్థాయి నేతల బహిరంగ సభలు వంటి వాటితో బిజీ అయిపోయాయి. అధికార టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు విమర్శల వాడిని పెంచాయి.

తాజాగా కాంగ్రెస్‌ నేతృత్వంలో లెఫ్ట్, టీజేఎస్, టీడీపీ తదితర మొత్తం 19 పార్టీలు ఒక వేదికపైకి వచ్చాయి. అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్నీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌నూ ఓడించాలనే ‘డబుల్‌ ఆపరేషన్‌’ను తెరమీదకు తెచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖæ పోటీ తప్పదనేది స్పష్టమవుతోంది. ఇంతదాకా టీఆర్‌ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయంగా తామే రూపొందుతామని భావిస్తూ వచ్చిన బీజేపీకి మరో రూపంలో కొత్త ప్రత్యర్థులు ఎదురౌతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి,  ప్రత్యామ్నాయం ఎవరో తేల్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలపై పడింది.
చదవండి: పంజాబ్‌ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్‌ దృష్టి

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కూడా ఈ రెండుపార్టీలను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కిందిస్థాయి నుంచి వివిధ కమిటీల నియామకం ద్వారా సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే కార్యాచరణలో నిమగ్నమైంది. రాష్ట్రంలో రాజుకుంటున్న రాజకీయ వేడికి హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం మలుపు తిప్పి, పార్టీల భవిష్యత్‌ వ్యూహాలను నిర్దేశించే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

పోటాపోటీ సభలు 
సెప్టెంబర్‌ 17న నిర్మల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభ నిర్వహించిన నాడే గజ్వేల్‌లో కాంగ్రెస్‌ సభను నిర్వహించింది. గతంలో లేనివిధంగా ఎన్నికలకు ఎంతో ముందుగానే రెండు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ సభలు జరిగాయి. దీంతో ప్రజల్లో ఎక్కువ స్పందన దేనికి వచ్చింది, ఏ సభకు ఎక్కువమంది హాజరయ్యారనే పోలిక అనివార్యంగానే ముందుకొచ్చింది. గత నెల 28 నుంచి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహిస్తున్న ‘ప్రజాసంగ్రామయాత్ర’ మొదటి దశ అక్టోబర్‌ 2న ముగియనున్న సందర్భంగా హుజురాబాద్‌లో నిర్వహించనున్న రోడ్‌షోలో ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి స్మృతీఇరానీ పాల్గొంటారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అదేరోజు సిరిసిల్లలో బహిరంగసభ నిర్వహించనున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించింది.
చదవండి: జగ్గారెడ్డి తీరుపై గాంధీభవన్‌లో వాడివేడి చర్చ

దీంతో మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీ కార్యక్రమాలు జరగనుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలాఉండగా, నిర్మల్‌లో అమిత్‌షా హెలికాప్టర్‌లో సభావేదిక వద్ద దిగినప్పటి నుంచి తిరుగు ప్రయాణమయ్యే దాకా కూడా పార్టీ ముఖ్యనేతలకు ప్రాధాన్యం, సమన్వయం వంటివి సరిగా లేవనే అభిప్రాయాన్ని కమల నాయకులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సంజయ్‌ పాదయాత్ర ఏర్పాట్లలో పూర్తిస్థాయిలో నిమగ్నమైన వారికి తగిన ప్రాధాన్యత లభించలేదని, కొందరు కనీసం వేదికపైకి రాలేకపోవడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దీంతో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ సైతం తన వ్యూహాలను మార్చుకునేందుకు సిద్ధమౌతోంది.  

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)