amp pages | Sakshi

పార్టీలో ఆయన గెస్ట్‌ ఆర్టిస్టు: కాంగ్రెస్‌ ఎంపీ

Published on Fri, 08/28/2020 - 18:06

తిరువనంతపురం: ఎంపీ శశి థరూర్‌ రాజకీయ నాయకుడు కాదని, ఆయన ‘గెస్ట్‌ ఆర్టిస్టు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోడిక్కున్నిల్‌ సురేశ్‌ విమర్శించారు. పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ స్వపక్ష నేతకు హితవు పలికారు. కాగా నాయకత్వ మార్పు, పార్టీలో సంస్కరణలు కోరుతూ అధినాయకత్వానికి లేఖ రాసిన 23 మంది నేతల లిస్టులో శశి థరూర్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభలో చీఫ్‌ విప్‌, కేరళ ప్రదేశ్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘శశి థరూర్‌ అసలు రాజకీయ నాయకుడే కాదు. కాంగ్రెస్‌ పార్టీలోకి గెస్ట్‌ ఆర్టిస్టుగా అడుగుపెట్టారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. ఆయన గ్లోబల్‌ సిటిజన్‌ అయి ఉండవచ్చు. (చదవండి: కాంగ్రెస్‌ విషయం తేల్చిపడేసిన ఆజాద్‌)

అంతమాత్రాన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు. అంతిమంగా ఎవరైనా సరే పార్టీ నియమాలు, నిబంధనలకు అనుగుణంగానే నడచుకోవాలి’’అని ఘాటుగా విమర్శించారు. కాగా గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, మనీశ్‌ తివారి, జితిన్‌ ప్రసాద, శశి థరూర్‌ తదితర 23 మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అధినాయత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగాలని తీర్మానించింది. ఈ సందర్భంగా గాంధీ కుటుంబ విధేయులు అసమ్మతి నేతల తీరును ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. ఇక పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలకు సీడబ్ల్యూసీ సమావేశంలో తాత్కాలికంగా బ్రేక్‌ పడినప్పటికీ అసమ్మతి నేతలపై విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.(చదవండి: ఇది దురదృష్టకరం: కపిల్‌ సిబల్‌)

అందుకే మౌనంగా ఉన్నా: శశి థరూర్‌
కేపీసీసీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ కె. మురళీధరన్‌ సైతం థరూర్‌ గురించి గురువారం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరాశకు గురైందని, థరూర్‌ మద్దతుతోనే కేంద్రం తిరువనంతపురం ఎయిర్‌పోర్టును అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చిందంటూ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన థరూర్‌.. ‘‘గత నాలుగు రోజులుగా నిశ్శబ్దంగా ఉంటున్నాను. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ చెప్పినందు వల్లే ఈ మౌనం. పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేయాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్చను ఇంతటితో వదిలేయాలని నా సహచరులకు విజ్ఞప్తి చేస్తున్నా’’అని ట్వీట్‌ చేశారు. కాగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటుకు అప్పజెప్పాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మద్దతు ఇవ్వడం కేరళలో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.(చదవండి: ఎయిర్‌పోర్ట్‌ వివాదం.. కేరళ మంత్రికి శశి థరూర్‌ రిప్లై)

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)