amp pages | Sakshi

బీజేపీ అధికారంలోకొస్తే పేదలకు భూములు, ఇళ్లు

Published on Tue, 02/21/2023 - 02:29

నాగోలు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పేదలకు భూములు ఇచ్చుడేమోగానీ గడచిన నాలుగు దశాబ్దాలుగా పేదల ఆధీనంలో ఉన్న భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకుంటోందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా, బీజేపీ కార్నర్‌ మీటింగ్‌లను నాగోలు కార్పొరేటర్‌ చింతల అరుణ సురేందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నాగోలు చౌరస్తాలో, బీజేపీ హస్తినాపురం డివిజన్‌ అధ్యక్షుడు నరేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం హస్తినాపురం చౌరస్తాలో నిర్వహించారు.

ఆయా సమావేశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ... ‘పల్లెల్లో ఉపాధి లేక వేల మంది పట్నానికి వలస వచ్చారు. వీరంతా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వమని అడిగితే ఇవ్వడంలేదు. ఒక్కరికి కూడా 50 గజాల భూమి ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన భూమిని గద్దల్లా గుంజుకుంటున్నారు’ అని ఆరోపించారు. హైదరాబాద్‌లో కిరాయిలు కట్టలేకపోతున్నాం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

‘ఎల్‌బీనగర్‌ కాలనీ వారికి భూములు రెగ్యులరైజ్‌ చేస్తామని మునుగోడు ఎన్నికల సందర్భంగా కేటీఆర్‌ వచ్చి జీఓ 118 ఇచ్చారు. ఓట్లు వేయించుకున్నారు. తరువాత మర్చిపోయారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా 118 జీఓను అమలు చేయాలి’ అని ఈటల డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల భూములకు పట్టాలు ఇస్తామని ఈటల రాజేందర్‌ స్పష్టం చశారు.

పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని...ఉద్యోగావకాశాలను కల్పిస్తాం అని భరోసా ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్మే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీజేపీ ఎల్‌బీనగర్‌ కన్వీనర్‌ రవీందర్‌గౌడ్, వనస్థలిపురం కార్పొరేటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, బద్దం బాలకృష్ణగౌడ్, శ్యామల, పద్మారెడ్డి, మైనం రాజేష్, రావుల శ్రీనివాస్, డప్పు రాజు, రాఘవాచారి, హస్తినాపు రం డివిజన్‌ అధ్యక్షుడు నరేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)