amp pages | Sakshi

ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ

Published on Sun, 02/06/2022 - 08:39

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్‌ దిగిందా లేదా..?  ఈ డైలాగ్‌ పండుగాడికే కాదు, అమిత్‌ పాలేకర్‌కు కూడా వర్తిస్తుంది. రాజకీయాలకు కొత్త. అయితేనేం గోవాలో అందరి దృష్టిని ఆకర్షించారు.  ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిన ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి ఎదిగారు.  పార్టీలో చేరిన రెండు నెలల్లోనే గోవా వారసత్వ సంపద (సహజ వనరులు) కాపాడడానికి  నిరాహారా దీక్షకు దిగి ప్రభుత్వం మెడలు వంచారు. కోవిడ్‌–19 సంక్షోభం నెలకొన్న వేళ మానవత్వంతో స్పందించి ఎందరి ప్రాణాలనో కాపాడారు.  సామాజిక సమస్యల పట్ల అవగాహన ఎక్కువ. సామాజిక, ఆర్థిక తారతమ్యాలను రూపుమాపడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు.  ఇప్పుడు ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ గోవా ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.  

1976 సంవత్సరంలో పుట్టారు. గోవా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు.  
కొద్ది రోజుల పాటు స్థానిక పత్రికలో జర్నలిస్టుగా పని చేశారు.  
అమిత్‌ పాలేకర్‌ తల్లి జ్యోతి పాలేకర్‌ బీజేపీ నాయకురాలు. మెర్సెస్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 25 ఏళ్ల పాటు కొనసాగారు. మనోహర్‌ పారికర్‌ మరణానంతరం ఆమె రాజకీయాలను వీడారు. 
తల్లి ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు అమిత్‌. సామాజిక సేవ చేయాలన్న కోరికతో ఆప్‌లో చేరారు. ఇప్పుడు తల్లి జ్యోతి కూడా అమిత్‌కు అండగా ఉన్నారు.  
వృత్తి రీత్యా లాయర్‌. సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్‌గా 22 సంవత్సరాలుగా పని చేశారు.  సివిల్, క్రిమినల్‌ కేసులు వాదిస్తూ పేరు తెచ్చుకున్నారు.  
అమిత్‌ భార్య రషిక కూడా లాయరే. గోవాలో రెస్టారెంట్‌ కూడా నడుపుతూ ఉంటారు. వారికి ఆరేళ్ల కూతురు ఉంది.  
చిన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కనేవారు. కానీ తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో యుక్త వయసు నుంచి ఆర్థిక, సామాజిక తారతమ్యాలను రూపుమాపాలని ఆలోచించేవారు.  
కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేశారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేశారు 
ఆక్సిజన్‌ కొరతపై తొలిసారిగా కోర్టుకెక్కిన కొంతమందిలో అమిత్‌ పాలేకర్‌ కూడా ఉన్నారు. 40 మందికిపైగా ఆక్సిజన్‌ దొరక్క ప్రాణాలు కోల్పోవడంతో బాంబే హైకోర్టు (గోవా బెంచ్‌)లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆక్సిజన్‌ సరఫరా జరిగేలా చూశారు.  
అక్టోబర్‌ 2021లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. 
పాత గోవాలో వారసత్వ సంపద పరిరక్షణకు చేసిన నిరాహార దీక్షతో పార్టీలోనూ, ప్రజల్లోనూ గుర్తింపు పొందారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రశంసలు కూడా దక్కాయి.

గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్‌ పాలేకర్‌ పేరుని 2022, జనవరి 19న ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రకటించారు.  
అమిత్‌ పాలేకర్‌ భండారీ వర్గానికి చెందిన ఓబీసీ నాయకుడు.  గోవా జనాభాలో 35 శాతం ఈ వర్గానికి చెందిన వారే. అందుకే కేజ్రివాల్‌ వ్యూహాత్మకంగా అమిత్‌ను ఎంపిక చేశారన్న విశ్లేషణలు ఉన్నాయి.  
ఢిల్లీలో సాధించిన అభివృద్ధి గోవాలో జరగాలంటే  ఆప్‌కే ఓటు వెయ్యండి అన్న నినాదంతో ముందుకు వెళుతున్నారు.
పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఆ పని తాను చేస్తామని అమిత్‌ ప్రచారం చేసుకుంటున్నారు.
ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని కోరుతున్నారు.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి    

నిరాహార దీక్షతో గుర్తింపు
ఆప్‌లో చేరిన రెండు నెలల్లోనే పాత గోవాలోని వారసత్వ ప్రాంతమైన గొయెమ్‌కార్పాను పరిరక్షించడానికి, అందులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగారు. మొదట్లో ఎవరూ ఈ దీక్షని పట్టించుకోలేదు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితులు మారిపోయాయి. అమిత్‌ దీక్షకు స్థానిక ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీక్షా శిబిరానికి జనం వెల్లువెత్తారు. దీంతో అయిదు రోజుల్లోనే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అమిత్‌ సాధించిన తొలి విజయం అది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)