amp pages | Sakshi

దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే

Published on Sat, 10/31/2020 - 08:45

మేమే గెలుస్తాం.. ప్రస్తుతం దుబ్బాకలో ప్రధాన పార్టీల నాయకుల నోట ఇదే మాట. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. రామలింగారెడ్డి చేసిన సేవలు తన విజయానికి సోపానాలని, అధిక మెజార్టీతో విజయం సాధిస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీపై సానుకూలత నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవంగా వ్యాప్తి చెందుతోందని, ఈసారి విజయం బీజేపీదేనని ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటున్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే అంటూ తమ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉందని, టీఆర్‌ఎస్, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటూ.. గెలుపుపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,90,483 ఓట్లు ఉండగా.. 1,63,658 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 89,112 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,691, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 22,595 ఓట్లు వచ్చాయి.  
– సాక్షి, సిద్దిపేట 

భారీ మెజార్టీ సాధిస్తాం 
ప్రజలకు టీఆర్‌ఎస్‌పై నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను. దుబ్బాక ప్రాంతం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. తాగునీరు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నా భర్త ప్రజల దాహార్తిని తీర్చారు. గోదావరి జలాల తరలింపుతో సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు తట్టాయి. ప్రజల కష్టాలు తీర్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ వెంట ప్రజలు ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. రామలింగారెడ్డి  చేసిన  సేవలు చూసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు.

 – సోలిపేట సుజాత (టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని) 

ఓటు బ్యాంకు ఉంది
నియోజకవర్గంలో మా తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి కళ్ల ముందు కన్పిస్తోంది. నాడు వెంట ఉండి నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి పంపించిన ప్రజలు ఇప్పుడు ఆయన వారసుడిగా.. నన్ను ఆదరిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ అంటే ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నుంచి ఇప్పటి వరకు మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా దుబ్బాకలో ఉండి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇలా ప్రతీ అంశం మా విజయానికి దోహద పడుతుంది.  
– చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌ అభ్యర్థి) 

మార్పు ఖాయం
అబద్ధాలకోరు టీఆర్‌ఎస్‌తో విసిగి పోయిన దుబ్బాక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఈ విప్లవమే బీజేపీ విజయానికి సోపానం అవుతుంది. రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో దుబ్బాక ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. కానీ రాష్ట్ర ఫలాలు మాత్రం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు అందుతున్నాయి. ఆ మూడు నియోజకవర్గాలను చూసిన వారెవ్వరూ దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయరు. దుబ్బాక నియోజకవర్గంలో 99 శాతం పల్లెలు ఉన్నాయి. పల్లెల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విరివిరిగా నిధులు ఇస్తుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ చరిష్మా సిద్దిపేటలో కూడా పనిచేస్తుంది. గెలిచినా..? ఓడినా..? దుబ్బాక ప్రజల మధ్యనే ఉన్నా..? ఈ సారి దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. నా విజయం దాదాపు ఖాయమైంది.
– రఘునందన్‌రావు (బీజేపీ అభ్యర్థి)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)