amp pages | Sakshi

గహ్లోత్‌కు మద్దతుగా పైలట్‌ వర్గం!

Published on Mon, 08/10/2020 - 14:33

జైపూర్‌: అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలమైన సచిన్‌ పైలట్‌ వర్గం ఎట్టకేలకు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్‌ వర్గంతో కాంగ్రెస్‌ అధిష్టానం జరుపుతున్న చర్చలు సానూకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో జరుపుతున్నచర్చల్లో పురోగతి కనిపిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. చివరగా ప్రియాంక గాంధీ, సచిన్‌ల భేటీతో ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తాయని కాంగ్రెస్‌ భావిస్తుంది. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, తిరుగుబాటు ఎమ్మెల్యేలు గహ్లోత్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను పైలట్‌ వర్గం ఖండించింది. గహ్లోత్‌ను ముఖ్యమంత్రి  పదవి నుంచి తొలగిస్తేనే మద్దతుగా నిలుస్తామని ఆయన వర్గం పేర్కొంది. 
(చదవండి : సత్యం పక్షాన నిలబడండి: గహ్లోత్‌)

 అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించినందుకు సచిన్ పైలట్ తో పాటు పలువురు అతని వర్గం నేతలను కాంగ్రెస్ పదవులు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రియాంక గాంధీ పైలట్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో ఇరువర్గాలు చర్చలు ముమ్మరం చేశాయి.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే  స్వాగతిస్తామని గహ్లోత్‌ పేర్కొనగా, గహ్లోత్‌ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేది లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు. మరో వైపు తిరుబాటు చేసిన19 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే విశ్వాస పరీక్షలో నెగ్గాలని గహ్లోత్‌ భావిస్తున్నారు. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. విశ్వాస పరీక్షలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఆదివారం లేఖలు రాశారు.‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’అని లేఖలో వ్యాఖ్యానించారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్‌కు తరలించింది. 

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)