amp pages | Sakshi

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు

Published on Mon, 09/07/2020 - 02:18

సాక్షి, హైదరాబాద్‌: రానున్న కాలంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు తెలుపుతారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2014, 18 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయని, కానీ ఇప్పుడు కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని, వాళ్లంతా కాంగ్రెస్‌ వైపు వస్తున్నారని చెప్పారు. ఆదివారం డీసీసీ అధ్యక్షులతో గాంధీభవన్‌లో ఉత్తమ్‌ సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో కష్టపడి పని చేస్తున్నారని, పార్టీ కూడా పటిష్టంగా ఉందని వివరించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని, ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్ని స్తుందని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షులు అంశాలవారీగా పోరాటాలు చేయాలని, ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై కొట్లాడి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.  

ప్రజా సమస్యలపై కేసీఆర్‌ను నిలదీద్దాం: భట్టి 
ప్రజల సమస్యలపై సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ వేదికగా నిలదీద్దామని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలు వంటి వాటిపై చర్చించడానికి టీపీసీసీ అధికార ప్రతినిధులతో గాంధీ భవన్‌లో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. అంశాల వారీగా సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కోరారు. వ్యవసాయం, నిరుద్యోగం, కరోనా రోగులపై నిర్లక్ష్యం, ప్రభుత్వ దవాఖానాల్లో లోపాలు, శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాదం, మైనారిటీ, దళిత వర్గాల సమస్యలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, నూతన రెవెన్యూ చట్టం, ఎల్‌ఆర్‌ఎస్‌ వల్ల పేదలపై భారం, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోడ్లు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి పలువురు అధికార ప్రతినిధులకు ఆయన బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బోరెడ్డి ఆయోధ్య రెడ్డి, ఇందిరా శోభన్, మొగుళ్ల రాజిరెడ్డి, కాల్వ సుజాత, సుధీర్‌రెడ్డి, సంధ్యా రెడ్డి, ఆశిరెడ్డి, నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.  

అసెంబ్లీలో గళం వినిపిస్తాం: జగ్గారెడ్డి 
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వారి పక్షాన గళం వినిపిస్తామని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం లో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు డమ్మీగా మారిపోయారని విమర్శించారు. తన నియోజకవర్గంలోని 40 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు. సంగారెడ్డి మెడికల్‌ కాలేజీ ఏమైందని ప్రశ్నించారు. సంగారెడ్డి ఆస్పత్రికి నిధులు కేటాయించాలని, 57 ఏళ్ల వయసు వారికి తక్షణమే పింఛన్‌ ఇవ్వాలని ప్రభు త్వాన్ని అడుగుతానని జగ్గారెడ్డి చెప్పారు. వచ్చే 15 రోజుల్లో మెడికల్‌ కాలేజీపై సీఎం హామీలు నెరవేర్చకపోతే తాను ఆరు రోజులు దీక్ష చేస్తానని తెలిపారు.  

‘బీసీల ప్రత్యేక బడ్జెట్‌పై నిర్ణయం తీసుకోండి’ 
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో బీసీ సబ్‌ప్లాన్‌ కోసం అప్పటి ప్రజాప్రతినిధులతో మూడు రోజులు చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో స్పష్టం చేయాలని కోరారు. అలాగే బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా గత ఐదేళ్లుగా ఒక్కరికి కూడా రూ.లక్ష రుణం అందలేదన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఆదివారం సీఎం కేసీఆర్‌కు జాజుల లేఖ రాశారు.  
నిరుద్యోగుల గోస వినిపించండి: చనగోని 
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని నిరుద్యోగుల గోస వినిపించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, నిరుద్యోగ ఫ్రంట్‌ చైర్మన్‌ చనగోని దయాకర్‌ కోరారు. కనీసం ఉద్యోగ నియామకాలు కూడా లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని, వారి పక్షాన బలమైన వాదనలు వినిపించాలని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ భృతి, యూనివర్సిటీల సమస్యలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్‌ చేశార 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)