amp pages | Sakshi

ప్రజాసమస్యలపై బీజేపీ పోరుబాట 

Published on Mon, 08/31/2020 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు తెలపాలని, ఉద్యమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ వివిధ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అధ్యక్షతన ఆదివారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి రోజుకో కార్యక్రమం చొప్పున 18 కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

నేటి నుంచి చేపట్టబోయే కార్యాచరణ 
► ఆగస్టు 31: వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కిసాన్‌ మోర్చా అధ్వర్యంలో వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం. ప్రైవేట్‌ టీచర్లు, కాలేజీ లెక్చరర్ల సమస్యలపై యువమోర్చా ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం. 
► సెప్టెంబర్‌ 1: పార్టీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు. 
► 2న: తెలంగాణ విమోచనం కోసం బలిదానమైన అమరవీరులకు పరకాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ శ్రద్ధాంజలి ఘటిస్తారు.  
► 3న: ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వినతిపత్రం 
► 3, 4 తేదీల్లో: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేయాలని, పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్లకు వినతిపత్రాలు. 
► 4న: కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు  
► 5న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు 
► 6న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో కళాకారుల సమావేశం నిర్వహణ. 
► 7న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌కు విన్నవించడం 
► 8న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో మేధావులతో సమావేశం నిర్వహణ  
► 11న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిరసన కార్యక్రమాలు 
► 12, 13 తేదీల్లో: కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సందర్శన 
► 17న ఉదయం: ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయజెండా          ఎగురవేయాలి  
► 17న సాయంత్రం: తెలంగాణ విమోచన దినోత్సవంపై బహిరంగ ర్యాలీ (వర్చువల్‌ ర్యాలీ) 
► 21న: గోదావరి నది జలాలపై రాష్ట్ర స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం 
► 25న: పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి పోలింగ్‌ బూత్‌లో కనీసం 10 మొక్కలు నాటాలి. 
► సెప్టెంబర్‌ చివరి నాటికి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్రంలో 100 రైతు ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో) ఏర్పాటు కోసం కార్యాచరణ.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)