amp pages | Sakshi

రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

Published on Wed, 09/07/2022 - 16:03

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్‌ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్‌ క్లియర్‌ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే  నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్‌ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వివరించారు.

అలాగే రైల్వే ల్యాండ్‌ లైసెన్స్‌ ఫీజు కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్‌ పీరియడ్‌ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించినట్లు ఠాకూర్‌ వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్‌కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. పీఎం గ‌తిశ‌క్తి కార్గో ట‌ర్మిన‌ల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వేభూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. అయిదేళ్ల‌లో 300 పిఎం గ‌తిశ‌క్తి కార్గో ట‌ర్మిన‌ల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారాయన.

ప్రైవేటీకరణలో భాగంగానే..  కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కేంద్ర కేబినెట్‌ తీసుకున్న రైల్వే లీజ్‌ నిర్ణయాలు.. నీతి ఆయోగ్‌ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్‌.. 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్‌ లీజింగ్‌ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధ‌ర‌కు రైల్వే భూములను లీజ్‌కు ఇవ్వాలని, పీపీపీ ప‌ద్ద‌తిలో రైల్వే భూముల‌ను ఆస్ప‌త్రులు, కేంద్రీయ విద్యాల‌యాల ఏర్పాటుకు ఇవ్వాల‌ని కూడా కేబినెట్‌ భేటీలో కేంద్రం నిర్ణ‌యించింది.

పీఎం శ్రీస్కూల్స్‌
కేంద్ర కేబినెట్‌లో ఇవాళ.. పీఎం శ్రీ పేరుతో మోడ‌ల్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశ‌వ్యాప్తంగా 14వేల పీఎం శ్రీ‌స్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్ష‌ల మంది విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుందని భావిస్తోంది. అలాగే.. కేంద్ర‌, రాష్ట్ర‌, స్థానిక ప్ర‌భుత్వాలు న‌డిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్‌ను  ఎంపిక‌ చేయనున్నారు. రాబోయే ఐదేళ్ల‌లో రూ. 27,360 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యం, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉండనుంది. నూత‌న జాతీయ విద్యావిధానం అమ‌లులో వీటిని ఆద‌ర్శంగా తీర్చిదిద్దాలని, అనుభ‌వాలు, ప్రాక్టీక‌ల్స్ ఆధారంగా విద్యాబోధ‌న‌కు ప్రాధాన్య‌త‌ ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ భావిస్తోంది. 

ఇదీ చదవండి: హెలికాప్టర్‌ సర్వీస్‌ పేరిట కుచ్చు టోపీ

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌