amp pages | Sakshi

‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆగిపోయింది.. కోటి టీకాలు కావాలి’ 

Published on Wed, 07/14/2021 - 15:31

‘రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిగా స్తంభించింది.. అన్ని వయసుల కేటగిరీల వారు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కోవిడ్‌ వ్యాక్సిన్ల కేటాయింపు లేవు.. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ కేటాయింపులు చాలా తక్కువ.. కేటాయింపుల్లో లోటును భర్తీ చేయండి.. ప్రత్యేకంగా కోటి వ్యాక్సిన్లను కేటాయిస్తేనే లక్ష్యాలను సాధించగలుతాం’ అని పీఎం మోదీకి ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం లేఖ రాశారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు కోటి డోసుల కరోనా వ్యాక్సిన్లను ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా కోరుతూ  ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉత్తరం రాశారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిగా స్తంభించడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. 18–44, 45 ఏళ్లు పైబడినవారు, 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్స్‌ ఇలా మూడు కేటగిరిల్లోని వారంతా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలన్నీ మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ‘వ్యాక్సిన్‌ వేయడం లేదు’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

తొలి డోసు వేసుకుని, రెండో డోసుకు గడువు దాటిపోయినా వ్యాక్సిన్‌ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నిర్ణీత గడువులోగా రెండో డోసు వేసుకోకుంటే తొలిడోసు కూడా వృథాగా మారుతుందని వైద్య నిపుణులు సూచిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రెండో డోసుకోసం వెళుతున్న ప్రజలకు సరైన సమా«ధానం కూడా కరువవడంతో ప్రభుత్వ వైద్య సిబ్బందితో ఘర్షణపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ ప్రధానికి ఉత్తరం రాశారు.‘తమిళనాడులో 18–44 మధ్య వయస్కులకు ఈనెల 8వ తేదీ వరకు 29,18,110 వ్యాక్సిన్లు, 45 ఏళ్లు పైబడిన వారికి 1,30,08,440 వ్యాక్సిన్లు కేటాయించాం. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కోవిడ్‌ వ్యాక్సిన్ల కేటాయింపు లేకపోవడంతో పరిస్థితి కఠినంగా మారింది. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా వ్యాక్సిన్ల కేటాయింపు లేదు. దీంతో 1000 : 302 దామాషాపై వ్యాక్సిన్‌ కేటాయించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ కేటాయింపులు చాలా తక్కువ. కాబట్టి వ్యాక్సిన్‌ కేటాయింపుల్లో తమిళనాడుకు ఇప్పటి వరకు జరిగిన లోటును భర్తీ చేయండి. అంతేగాక ప్రత్యేకంగా కోటి వ్యాక్సిన్లను కేటాయించినపుడే నిర్దిష్ట కాల పరిమితిలో లక్ష్యాలను సాధించగలుగుతాం’ అని లేఖలో సీఎం వివరించారు.  

విదేశీ మందులపై పన్ను మినహాయించండి 
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జెనిటిక్‌ మందులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు సీఎం స్టాలిన్‌ మంగళవారం మరో ఉత్తరం రాశారు. వెన్నుముక చలనం కోల్పోయిన వ్యక్తికి జెనిటిక్‌ (డీఎన్‌ఏ) చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన వ్యాధిగ్రస్తుడికి అందించాల్సిన మందు విలువ రూ.16 కోట్లుగా ఉంది. ఈ మందును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. జెనిటిక్‌ వ్యాధుల బారిన పడేవారు రాష్ట్రంలో ఏడాదికి  90 నుంచి 100 మంది వరకు ఉంటున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు రోగులు భారీగా ఎదరవుతున్న ఖర్చులు భరించలేక పోతున్నారు. ప్రజలకు ప్రాణాలుపోయగల ఈ మందుల దిగుమతిపై విధించే కస్టమ్స్‌ సుంకంతోపాటు జీఎస్టీని కూడా కేంద్రం మినహాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)