రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వెంటిలేటర్ బెడ్ దొరకక ప్రముఖ గాయకుడు కన్నుమూత
Published on Mon, 04/26/2021 - 10:20
న్యూఢిల్లీ: ప్రముఖ హిందుస్థానీ గాయకుడు రాజన్ మిశ్రా (70) ఆదివారం కరోనాతో కన్నుమూశారు. సోదరుడు సజన్ మిశ్రాతో కలిసి రాజన్ ‘ఖయాల్ గాయకీ’ శైలికి విశేష ప్రాచుర్యం కల్పించారు. కాగా మూడురోజులుగా సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజన్ పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించింది. అయితే వెంటిలేటర్ బెడ్ కోసం వెదకగా ఫలితం లేకుండా పోయింది.
దీంతో, శ్రేయోభిలాషులు, మిత్రులు సోషల్ మీడియా ద్వారా సాయం కోరారు. చివరకు ప్రధాని కార్యాలయం స్పందించి వెంటిలేటర్ సదుపాయాన్ని కల్పిస్తామని కుటుంబసభ్యులను సంప్రదించింది. కానీ అప్పటికే రాజన్ మిశ్రా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆయన కుమారుడు రజనీష్ తెలిపారు.
చదవండి: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ శంతను గౌడర్ మృతి
#
Tags