West Bengal: మింగేసిన మెరుపు వరద

Published on Fri, 10/07/2022 - 07:58

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం మాల్‌ నదిలో దిగిన భక్తులను ఆకస్మిక వరద కబళించింది. జల్‌పాయ్‌గురి జిల్లాలో బుధవారం రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చిన్నపాటి ప్రవాహం, బురదమయమైన మాల్‌ నది ఒడ్డున దాదాపు 70 మంది స్థానికులు దుర్గామాత విగ్రహంతో చేరుకున్నారు. లోపలికి వెళ్లి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నది ప్రవాహం ఉధృతమైంది.

అందరూ అప్రమత్తమై ఒడ్డుకు చేరుకునేలోపే ప్రవాహం మహోగ్రంగా మారింది. దీంతో దాదాపు 80 మంది కొట్టుకుపోసాగారు. ఒడ్డున ఉన్న యువత, వలంటీర్లు దాదాపు 70 మందికిపైగా భక్తులను కాపాడారు. ఎనిమిది మంది ప్రవాహంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని జాతీయసహాయక నిధి నుంచి మృతుల కుటుంబాలకు చెరో రూ.2 లక్షల సాయం ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సైతం మృతులకు చెరో రూ.2లక్షల సాయం ప్రకటించింది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ