amp pages | Sakshi

రాజ్యసభ ఎన్నికలు: ఆ రాష్ట్రంలో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ

Published on Fri, 06/10/2022 - 08:53

► కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్‌, ఎమ్మెల్సీ లేహర్‌ సింగ్‌ సిరోయా, నటుడు జగ్గేశ్‌ విజయం సాధించగా.. కాంగ్రెస్‌ నుంచి జైరాం రమేష్‌ విజయాన్ని అందుకున్నారు. 

► రాజస్థాన్‌లో బీజేపీ నుంచి ఘనశ్యామ్‌ తివారీ గెలుపొందగా, కాంగ్రెస్‌ నుంచి రణ్‌దీప్‌ సుర్జేవాలా, ముకుల్‌ వాస్నిక్‌, ప్రమోద్‌ తివారీలు విజయం సాధించారు. 

► రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. జీ మీడియా అధినేత సుభాష్‌ చంద్ర పరాజయం చవిచూశారు.

►కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణాల నుంచి 16 రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల ఓటింగ్‌ ముగిసింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్‌ ముగియగా, ఐదు గంటల నుంచి కౌంటిగ్‌ ప్రారంభమైంది. దాంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

►మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆమె.. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె స్ట్రెచర్‌పై నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

► కర్ణాటకలో రాజ్యసభ ఎన్నిక‌ల్లో జేడీఎస్‌ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల్లోని 16  రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది.

► తమ 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారని ఆ పార్టీలో చేరిన మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే రాజేంద్ర గూడ తెలిపారు. తమకు 126 ఓట్లు ఉన్నాయని, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

► మహా వికాస్ అఘాడికి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుస్తారని, విజయంపై తమకు పూర్తి నమ్మకం ఉందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు.

► అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం జరగనున్న మహారాష్ట్ర నంఉచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది.

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో ప్రలోభాల ఆరోపణలతో రిసార్టులు, హోటళ్లలో మకాం వేసిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు నేడు బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక పరిశీలకులను నియమించి, పోలింగ్‌ ప్రక్రియను ఆసాంతం వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణాల నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయెల్, కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్‌ వాస్నిక్, శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ తదితరులున్నారు.

ఎన్నికల్లో వీరి గెలుపు ఖాయమని భావిస్తున్నారు. మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు గాను ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గత వారం ఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లోని మిగతా 16 సీట్లకు గాను పోటీ తీవ్రంగా ఉంది.  ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు.

తీవ్ర పోటీ
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లో 4 స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ ఎ‍మ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు, కర్ణాటకలో 5, రాజస్థాన్‌లో 5,  ఇక హర్యానాలో 2 సీట్లకు ఓటింగ్ జరగనుంది. కాగా జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించున్నాయి. ఇప్పుడు గెలుపొందిన వారు రాష్ట్రపతి ఎన్నికల్లోఓటు వేయనున్నారు. కాగా అత్యధికంగా 

చదవండి: రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ; రిసార్ట్‌కు ఎమ్మెల్యేల తరలింపు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)