amp pages | Sakshi

మీ భూములు సురక్షితం

Published on Sat, 12/26/2020 - 02:28

న్యూఢిల్లీ: ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్‌ ఫా మింగ్‌) వల్ల రైతుల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటారన్నది అవాస్తవమని, ఆ భయాలు పెట్టుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపోహలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏడు రాష్ట్రాల రైతుల విజయగాధలను శుక్రవారం ప్రధాని విన్నారు. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో తాము పొందిన ప్రయోజనాలను అరుణాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణాలకు చెందిన ఏడుగురు రైతులు ప్రధానికి వివరించారు. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించిన తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి కిసాన్‌’ పథకానికి సంబంధించి రూ. 18 వేల కోట్లను ప్రధాని 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ‘కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మీలాంటి వారు చెబితే ఇతరుల్లోనూ తమ భూమి ఎక్కడికీ పోదనే ధైర్యం వస్తుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఒప్పంద ఉల్లంఘనకు గతంలో రైతులకు పెనాల్టీ ఉండేదని, తమ కొత్త చట్టంలో ఆ జరిమానా నిబంధన లేదని వివరించారు. ‘కొత్త చట్టం ప్రకారం ప్రైవేటు కంపెనీ తన ఇష్టానుసారం ఒప్పందం నుంచి వైదొలగే అవకాశం లేదు. కానీ రైతులు, తాము కోరుకుంటే ఒప్పందం నుంచి వైదొలగవచ్చు. ఇది రైతులకు అనుకూల నిబంధన కాదా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒప్పంద రేటు కన్నా మార్కెట్‌ రేటు ఎక్కువ ఉంటే దిగుబడులకు రైతులకు బోనస్‌ లభిస్తుందని వివరించారు.


అందుకే చర్చల్లో ప్రతిష్టంభన
రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి జోక్యం వల్లనే రైతులతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ప్రధాని విమర్శించారు. కొత్త సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఆ చర్చలు ‘సహేతుకమైన, వాస్తవికమైన రైతు అభ్యంతరాల’ పైననే జరగాలన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి చేతుల్లోకి ప్రస్తుతం రైతు ఆందోళనలు వెళ్లాయని, అందువల్లనే అర్థంలేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. కొత్త సాగు చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారన్నారు.

ప్రజాదరణ కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు తమ రాజకీయ అస్తిత్వం కోసం రైతులను వాడుకుంటున్నాయని ఆరోపించారు.  తనను కొందరు నేతలు, ఆందోళనకారులు అభ్యంతరకర భాషలో దూషించారని, అయినా తాను అవేవీ పట్టించుకోనని ప్రధాని పేర్కొన్నారు. వారికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల్లో విబేధాలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీని ఇచ్చేందుకు, తమ ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు కచ్చితమైన కార్యాచరణ చూపాలని ప్రధానిని కోరారు.  

మోదీపీఎంగా  ఉన్నంతవరకు..
నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ కార్పొరేట్‌ సంస్థ కూడా రైతు భూమిని స్వాధీనం చేసుకోలేదని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘ఎమ్మెస్పీ విధానం కొనసాగుతుంది, మండీలు మూతపడవు, మీ భూములను ఎవరూ స్వాధీనం చేసుకోరు’ అని రైతులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశ రాజధాని ప్రాంతంలోని కిషన్‌గంజ్‌ గ్రామంలో రైతులనుద్దేశించి షా ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత స్మృతి ఇరానీ విమర్శించారు. ౖఆయన సొంత బావ రాబర్ట్‌ వాద్రానే రైతుల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. యూపీలోని అమేథీలో జరిగిన రైతు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.   

నేడు నిర్ణయం
కేంద్రంతో చర్చలు కొనసాగించే విషయంపై నేడు రైతు సంఘాలు చర్చించనున్నాయి. చర్చలకు రావాలన్న కేంద్రం ప్రతిపాదనకు లిఖితపూర్వక సమాధానాన్ని సిద్ధం చేయనున్నాయి.

ఒకటి రెండేళ్లు చూడండి
‘కొత్త సాగు చట్టాలను ఒక ప్రయోగంలా ఒకటి రెండేళ్లు ప్రయత్నించండి. అవి ప్రయోజనకరం కాదని తేలితే ప్రభుత్వం వాటికి అవసరమైన సవరణలు చేస్తుంది’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రైతులకు సూచించారు. ఆందోళనలు చేస్తున్న రైతులంతా తమ వారేనని, వారు రైతు బిడ్డలని, వారంటే తమకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. రైతులకు హాని కలిగించే చర్యలు ప్రధాని మోదీ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఒక ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  

పార్లమెంట్‌లో ఆప్‌ సభ్యుల నిరసన
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రధాని మోదీ ముందు ఆప్‌ ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం ప్రధాని మోదీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి: ఎ కమామొరేటివ్‌ వాల్యూమ్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా.. ఆప్‌ సభ్యులు సంజయ్‌ సింగ్, భగవంత్‌ మన్‌ లేచి నిల్చుని రైతు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.  

వాజ్‌పేయి వల్లనే బలమైన భారత్‌!
న్యూఢిల్లీ:  భారత్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో అటల్‌ కృషిని దేశం ఎప్పటికీ మరవలేదని ప్రధాని మోదీ ప్రశంసించారు.  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయన్ను ఘనంగా స్మరించుకున్నారు.  పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితోపాటు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశంలో ‘‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్‌ వాల్యూం’’ అనే పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. సదైవ్‌ అటల్‌ మెమోరియల్‌ వద్ద  రాష్ట్రపతి రామ్‌నాధ్‌ వాజ్‌పాయ్‌కు అంజలి అర్పించారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)