amp pages | Sakshi

సామాన్యుల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ

Published on Mon, 03/15/2021 - 18:13

భారత ప్రభుత్వం ఇప్పటికే పేదల కోసం అనేక సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ఉద్దేశ్యం పేదల జీవితాల్లో వెలుగును తీసుకురావడం. ప్రధానంగా వారికీ సామాజిక భద్రత కల్పించడం. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా “ఆమ్ ఆద్మీ బీమా యోజన” భీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ కింద బీమా చేసిన వ్యక్తికి చాలా ప్రయోజనాలు చేకూర నున్నాయి. ఈ పాలసీ కింద చేరిన వారు భీమా కాలంలో సహజ మరణంతో మరణిస్తే నామినీకి 30 వేల రూపాయలు లభిస్తాయి. 

యాక్సిడెంటల్ డెత్ ‌కింద మరణిస్తే 75 వేల రూపాయలు అందుతాయి. ఒకవేల ఏదైనా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం కలిగితే 75 వేల రూపాయలు లభిస్తాయి. అలాగే ప్రమాదంలో రెండు కళ్ళు కోల్పోవడం, చేతులు లేదా కాళ్ళు రెండూ కోల్పోయిన వారితో పాటు ఒక కన్ను, ఒక చేయి లేదా కాలు కోల్పోవడంజరిగితే అతనికి 37,500 రూపాయలు లభిస్తాయి. ఈ బీమా పథకం కింద చేరిన తర్వాత పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది. ఇది అదనపు సేవల కిందికి వస్తాయి. దీని కింద చేరిన వారి ఇద్దరు పిల్లలు 9-12 తరగతుల్లో చదివేటప్పుడు ప్రతి నెలా 100-100 రూపాయలు లభిస్తాయి. ఆరు నెలలకు ఒకసారి జులై, జనవరి మొదటి తేదీల్లో నాలుగు సంవత్సరాల పాటు జమ అవుతాయి.

ఈ పథకం కింద కుటుంబంలోని ఒక సభ్యుడిని మాత్రమే భీమా లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి వయస్సు 18-59 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండటం ముఖ్యం. బీమా చేసినవారికి ఏదైనా జరిగితే అప్పుడు డబ్బు నెఫ్ట్ లేదా లబ్ధిదారుని/నామినీ ఖాతాలో జమ అవుతుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం రూ.200 ఇందులో ప్రభుత్వం రూ.100 జమ చేస్తే, బీమా చేసిన వ్యక్తి రూ.100  జమ చేయాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి గ్రామీణ ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే బీడీ కార్మికులు, వడ్రంగి, మత్స్యకారులు, హస్తకళల వంటి 24 రకాల వృత్తుల వారికి వర్తిస్తుంది.

చదవండి:

ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు

2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం

#

Tags

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌