గుజరాత్‌లో సన్యాసిగా సంపన్నుడి కూతురు

Published on Wed, 01/18/2023 - 21:12

చిన్నవయసులో భౌతిక సుఖాలను త్యజించి సన్యాసం స్వీకరించింది తొమ్మిదేళ్ల చిన్నారి. ఈ ఘటన గుజరాత్‌లోని వెసు అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. పైగా ఆ చిన్నారి సంపన్న వజ్రాల వ్యాపారి కూతురు. వివరాల్లోకెళ్తే వజ్రాల వ్యాపారి ధనేష్‌ అతడి భార్య సంఘ్వీలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె దేవాన్షి సన్యాసిగా దీక్ష తీసుకుంటున్నట్లు కుటంబ సభ్యులు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి సూరత్‌లో దాదాపు మూడు దశాబ్దాల నాటి డైమండ్‌ పాలిషింగ్‌ ఎగుమతి సంస్థ సంఘ్వీ అండ్‌ సన్స్‌ యజమాని.

ప్రస్తుతం ఆమె అన్ని విలాసాలను త్యజించి సన్యాసి దీక్ష తీసుకుంటుంది. చిన్న వయసు నుంచి ఆమె ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అంతేగాదు అధికారికంగా ఈ సన్యాసి జీవితాన్ని స్వీకరించడానికి ముందు ఇతర సన్యాసులతో సుమారు రూ.700 కి.మీ దూరం నడించిందని, వారిలా జీవనం సాగించిందని కుంటుంబికులు చెబుతున్నారు. ఆమెకు ఐదు భాషలు తెలుసని, పైగా ఇతర ప్రత్యేక నైపుణ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సన్యాసి దీక్ష వేడుక గత శనివారం ప్రారంభమైంది. అంతేగాదు మంగళవారం, దేవాన్షి 'దీక్ష' తీసుకునే ఒక రోజు ముందు, నగరంలో కోలాహలంగా పెద్ద ఎత్తున మతపరమైన ఊరేగింపు జరిగింది.

(చదవండి: విచిత్రమైన ప్రేమ కథ: చ​నిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ