amp pages | Sakshi

ఆ మూడు నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ

Published on Thu, 03/18/2021 - 12:45

అహ్మదాబాద్ : భారత్‌లో కరోనా మహమ్మారి వైరస్‌ విజృంభించి ఏడాది గడుస్తున్నా కోవిడ్‌ నుంచి ఇంకా ప్రజలు పూర్తి ఉపశమనం దొరకడం లేదు. ఒకవైపు వ్యాక్సిన్‌ వచ్చినా కోవిడ్‌ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా గత కొన్నికాలంగా మళ్లి తన ప్రతాపాన్నిచూపిస్తోంది. దీనిలో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వం అహ్మదాబాద్ మున్సిపల్ సంస్ధ నడుపుతున్న బస్సులను గురువారం నుంచి తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు నిలిపివేసింది. గత మూడు నెలల్లో మొదటిసారిగా గుజరాత్‌లో మార్చి 17న  కేసులు 1000 మార్కును దాటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,122 కరోనావైరస్ కేసులుగా నమోదయ్యాయి.

నగరంలో రాత్రి పూట కర్ఫ్యూ
నగరంలోని వైరస్‌ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఎనిమిది  వార్డులలోని రెస్టారెంట్లు, మాల్స్‌ను, షో రూములు, టీ స్టాల్స్, బట్టల దుకాణాలు, పాన్ పార్లర్స్, హెయిర్ సెలూన్లు, స్పా, జిమ్స్ లను రాత్రి 10  తరువాత మూసివేయాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మార్చి 15 న ఉత్తర్వులు జారీ చేసింది.  వీటితో పాటు అహ్మదాబాద్, సూరత్, వడోదర మరియు రాజకోట్‌ ప్రాంతాలలో రాత్రి కర్ఫ్యూ విధించింది. మార్చి 31 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. వీటితో పాటు నివారణ చర్యల్లో భాగంగా జంతు ప్రదర్శనశాలతో సహా అన్ని తోటలు, ఉద్యానవనాలు ఈ రోజు నుండి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం, కోవిడ్‌-19 బారిన పడి అహ్మదాబాద్ లో 2,269 మరణాలు నమోదు అయ్యియి. వైరస్‌ నుంచి 58,043 మంది కోలుకుంటున్నారు, రికవరీ రేటు 95.3 శాతంగా ఉంది. 

వైరస్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
దేశంలో కరోనా సమస్యపై ప్రధాని బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. సమావేశం తరువాత, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రోజువారీ పరీక్షలు, టీకాల సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో మహమ్మారి పరిస్థితిని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని  ఏర్పాటు చేశామని  అందుకు  రూపానీనే స్వయంగా నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌