తాగేసి కారు పైకి ఎక్కి హంగామా... ఊహించని ట్విస్ట్‌!

Published on Sat, 04/02/2022 - 13:58

Ghaziabad Traffic Police has fined a car owner: ఇటీవలకాలంలో సోషల్‌ మాధ్యమాల్లో స్టార్‌డమ్‌ కోసమో లేక ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకో కొన్ని విచిత్రమైన ఫీట్‌లు చేస్తుంటారు. అవి ఒకోసారి ప్రాణాంతకంగా మారడమో లేక పోలీసులు ఆగ్రహానికి గురై కటకటాల పాలవడమో జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ఘజియాబాద్‌లోని రద్దీగా ఉండే ఢిల్లీ మీరట్‌ ఎక్క్‌ప్రెస్‌ హైవేలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారు పై డ్యాన్స్‌ చేశారు. అయితే ఆ కారుని ఒక వ్యక్తి నడుపుతుండగా ..మరో వ్యక్తి ప్యాసింజర్‌ సీట్‌లో కూర్చున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది. దీంతో మోహిత్ గుర్జార్‌ అనే ఒక సోషల్‌ మీడియా వినియోగ దారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ వాహనాన్ని మారుతి సుజికి ఎర్టిగా గుర్తించారు.

వీడియోలో కనిపిస్తున్న  నెంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ఆ వాహన యజమాని పై ట్రాఫిక్‌ పోలీసులు సుమారు రూ. 20 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో బులంద్‌షహర్ రోడ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి 8 గం.ల సమయంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించినందుకుగానూ అతని వాహన రిజిస్ట్రేషన్‌ని రద్దు చేశారు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు, ఫైన్‌ వేసిన ఈ చలానా కాపీని కూడా ట్రాఫిక్‌ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

(చదవండి: కోతుల బెడద.. ఆ కటౌట్‌ చూసి పరిగెత్తాలి డ్యూడ్‌)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ