amp pages | Sakshi

కరోనా: ఎలక్షన్‌ కమిషన్‌ మార్గదర్శకాలు ఇవే!

Published on Fri, 08/21/2020 - 19:47

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎలక్షన్‌ సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది, ఓటర్లు ప్రతి ఒక్కరికి  గ్లౌజులు ఇవ్వాలని, శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని ఈసీ ఆదేశించింది. ఓటరు రిజిస్టర్‌లో సంతకం చేయడం, ఓటేయడానికి ఈవీఎం బటన్ మీద నొక్కడం కోసం ఓటర్లందరికీ చేతి గ్లౌజులు ఇచ్చేలా ఈసీ మార్గదర్శకాలు రూపొందించింది.అలాగే ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి టెంపరేచర్‌ చెక్‌ చేసేలా థర్మల్‌ స్స్ర్కీనింగ్‌ను  ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించింది. 

సెప్టెంబర్ 20వ తేదీన బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ల అభ్యర్థనలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్-నవంబర్ నెలల్లో బిహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశం ఉంది. ఈసారి నామినేషన్లు, డిపాజిట్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్‌ చరిత్రలో తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లు, డిపాజిట్‌లు స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసి,  ప్రింటౌట్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేయొచ్చని సూచించింది.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల  సూచనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ బహిరంగ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అభ్యర్థితోపాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే వారి సంఖ్య ఐదుకు మించొద్దని ఈసీ నిబంధన విధించింది. కరోనా బారిన పడిన వారు, 80 ఏళ్లు దాటిన వారు, వైకల్యం ఉన్న వారు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తోన్న వారు పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ సడలింపులు ఇచ్చింది. ఓటు వేసే సమయంలో ఓటరు మాస్క్‌ను తొలగించి ఒకసారి నిర్ధారణ చేసుకున్న తరువాత ఓటు వేయడానికి అనుమతించనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఎందుకంటే ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎవరికైనా కరోనా సోకినట్లు తెలిస్తే వారి స్థానంలో మరొకరిని నియమించడానికి ఎక్కువ సిబ్బందిని  విధుల్లోకి తీసుకోనున్నారు. అలాగే కౌంటింగ్‌ సమయంలోనూ వేరు వేరు గదులలో సామాజిక దూరం పాటిస్తూ ఓట్లను లెక్కించనున్నారు.   

చదవండి: ఎన్నికలపై 3 రోజుల్లో మార్గదర్శకాలు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)