amp pages | Sakshi

30న చర్చలకు రండి

Published on Tue, 12/29/2020 - 05:55

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది..ఈ నెల 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను అంగీకరించకుండా కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. అయితే ప్రభుత్వ ఆహ్వానాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని సంఘాలు తెలిపాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 34వ రోజుకు చేరుకుంది. ప్రతిష్టంభన తొలగించేందుకు ఈనెల 30న చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాలను ఆహ్వానించింది. సాగు చట్టాలకు సంబంధించిన అన్ని అంశాలు చర్చించి ఒక సరైన పరిష్కారం కనుగొనేందుకు చర్చిద్దామని తెలిపింది.

వ్యవసాయ చట్టాలపై ఈనెల 29న చర్చిద్దామన్న రైతు సంఘాల ప్రతిపాదనకు ప్రభుత్వం బదులిస్తూ ఈ నెల 30న చర్చలకు సరేనంది. ఈ మేరకు బుధవారం విజ్ఞాన భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ లేఖ రాశారు. ఇప్పటివరకు ఇరు పక్షాల మధ్య ఐదు మార్లు చర్చలు జరిగాయి. ఇరు పక్షాల మధ్య ఈ నెల 5న జరిగిన చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. తిరిగి డిసెంబర్‌9న చర్చలు జరగాల్సిఉండగా వాయిదా పడ్డాయి. ఆ సమయంలో హోంమంత్రి అమిత్‌షాతో జరిపిన చర్చలు ఫలితాన్నివ్వలేదు. కానీ చర్చల అనంతరం చట్టాలకు 7–8 సవరణలు చేయడంతో పాటు, ఎంఎస్‌పీపై రాతపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 29న చర్చించేందుకు తయారని రైతు సంఘాలు కేంద్రానికి వెల్లడించాయి.  

మేం రెడీ, కానీ..
ఈనెల 30న చర్చలకు రావాలన్న కేంద్ర ప్రతిపాదనపై రైతు సంఘాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి. కానీ ముందుగా కేంద్రం చర్చల ఎజెండాను ప్రకటించాలని కోరాయి.  తాము ప్రతిపాదించిన పూర్తి ఎజెండాకు అంగీకరించట్లేదని, సమస్యలను పరిష్కరించేందుకు ఏమాత్రం ఇష్టపడట్లేదనేది అర్థమౌతోందని  అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయడం, ఎంఎస్‌పీకి గ్యారెంటీ ఇవ్వడం అనే అంశాలను ఎజెండాలో ఉంచాలనేది తమ డిమాండని, కానీ ప్రభుత్వం తాజా లేఖలో ఇవేమీ ప్రస్తావించలేదని రైతు సంఘ నాయకుడు అభిమన్యు కోహార్‌ చెప్పారు.   
వచ్చే నెల్లో నిరసనలు  
వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్‌ చట్టంపై ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా బలోపేతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించింది. ఈమేరకు జనవరి 6, 7 తేదీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏఐఏడబ్ల్యూయూ పిలుపునిచ్చింది. జిల్లా స్థాయిలో వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌ తెలిపారు.

1500 సెల్‌ టవర్లు ధ్వంసం
పంజాబ్‌లో దాదాపు 1500కు పైగా సెల్‌ టవర్లను రైతులు ధ్వంసం చేసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో పలు చోట్ల సెల్‌ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలిసింది. టవర్‌కు పవర్‌ సప్లై ఆపడం, కేబుల్స్‌ కట్‌ చేయడం వంటి చర్యలతో 1411 టవర్లు డ్యామేజీ అయ్యాయని, వాటి సంఖ్య ప్రస్తుతం 1500 దాటి ఉంటుందని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అంబానీ, ఆదానీలకు కొత్త సాగు చట్టాలు మేలు చేస్తాయన్న పుకార్లతో రైతులు విధ్వంసానికి దిగినట్లు చెప్పారు.

మా ఎజెండా ఇదే..
సాగు చట్టాల రద్దు, ఎంఎస్‌పీకి లీగల్‌ గ్యారెంటీ, ఢిల్లీలో వాయుకాలుష్య నివారణ ఆర్డినెన్సుకు సవరణలు, విద్యుత్‌ బిల్లుకు కీలక సవరణలు చేయడమనేవి తమ ఎజెండాలో ముఖ్యమైన అంశాలని రైతు సంఘాలు తెలిపాయి. ప్రభుత్వం మాత్రం అస్పష్టమైన విధానంతో చర్చలకు ఆహ్వానిస్తోందని విమర్శించాయి. కాగా మూడు సాగు చట్టాలు, ఎంఎస్‌పీ, విద్యుత్‌ బిల్లు, ఢిల్లీలో వాయుకాలుష్య నివారణ ఆర్డినెన్సుపై కూలంకషంగా చర్చిస్తామని వ్యవసాయ కార్యదర్శి సంజయ్‌ చెప్పారు. అయితే రైతు సంఘాలు కోరినట్లు స్పష్టమైన వాగ్దానాలేవీ కేంద్రం చేయలేదు. మరోవైపు నెలపైగా ఆందోళన చేస్తున్న రైతుల్లో కొందరు సొంతవూర్లకు వెళ్లి కుటుంబాలతో కలిసి తిరిగి వస్తున్నట్లు తెలిసింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)