amp pages | Sakshi

మేం వచ్చేశాం

Published on Tue, 03/01/2022 - 04:53

సాక్షి, న్యూఢిల్లీ, ముంబై/శంషాబాద్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు విడతలవారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానాలలో రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు చెందిన 11 మందితోపాటు ఏపీకి చెందిన మరో 11 మంది ఢిల్లీకి చేరుకున్నారు.

అలాగే సోమవారం సాయంత్రం తెలంగాణకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ నుంచి ఢిల్లీకి వచ్చారు. వారికి ఏపీ, తెలంగాణ భవన్‌ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు అందించారు. వీరు ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం 6:30 గంటలకు ముంబై చేరుకోనున్న మరో విమానంలోనూ పదుల సంఖ్యలో తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలంగాణ ఐఏఎస్‌ అధికారి ఎ. శరత్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నోడల్‌ అధికారి వి. రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. 

రెండు నెలల్లో ఎంబీబీఎస్‌ పూర్తయ్యేది
మరో రెండు నెలల్లో నా ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తయ్యేది. కానీ ఈ యుద్ధం కారణంగా అన్నీ వదిలేసి తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత కోర్సుకు సంబంధించి యూనివర్సిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాల్సిందే.
– సుధేశ్‌ మోహన్‌ నట్ల, ఒంగోలు 

సరిహద్దులో రెండు రోజులు 
మేము టికెట్‌ బుక్‌ చేసుకున్నా విమానాలు లేకపోవడంతో స్నేహితులందరం తొలుత ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరుకున్నాం. అక్కడ రెండు రోజులపాటు మమ్మల్ని రొమేనియాలోకి వెళ్లనీయకుండా సైనికులు అడ్డుకున్నారు.  చివరకు సరిహద్దు దాటాక భారత రాయబార అధికారులు మమల్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌లో మన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు.   
 
–నిషారాణి (ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం) శంషాబాద్‌ 

ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నా. యుద్ధం కారణంగా మా యూనివర్సిటీలో వాళ్లందరం తొలుత ఎంతో కష్టపడి ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరుకున్నాం. కానీ అక్కడి భద్రతా దళాలు ఉక్రెయినియన్లకే మొదటగా దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాయి. దీంతో సరిహద్దు దాటడానికి మాకు ఒకటిన్నర రోజులు పట్టింది. ఇంకా చాలా మంది భారతీయులు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. 
 
– విష్ణు, సూర్యాపేట 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌