వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
సైదులు.. ఊరి జనం చేసిన తిరుగుబాటు
Published on Wed, 04/20/2022 - 08:02
రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా జంటగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైదులు’. బెనర్జీ కీలక పాత్రలో నటించారు. మరబత్తుల బ్రహ్మానందం నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ని దర్శకుడు శశి కిరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ రియాలిటీకి దగ్గరగా ఉంది. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి.. మరిన్ని రావాలి’’ అన్నారు.
‘‘1980లో తెలంగాణ నేపథ్యంలో జరిగిన కథ ఇది. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించాను’’ అన్నారు బాబా పీఆర్. ‘‘ఈ చిత్రాన్ని బాబా బాగా తీశారు’’ అన్నారు మరబత్తుల బ్రహ్మానందం.
చదవండి: దక్షిణాది భాషల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ స్ట్రీమింగ్, ఎక్కడంటే
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్!
Tags