వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
23 ఏళ్ల తర్వాత మళ్లీ అతనితో
Published on Tue, 11/24/2020 - 00:40
మాధురీ దీక్షిత్ నటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి.. ‘నటి’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటీ అంటే... ఆమె నటించనున్న తాజా వెబ్ సిరీస్ టైటిల్ ‘యాక్ట్రెస్’ (నటి). ఈ సిరీస్లో మాధురి టైటిల్ రోల్లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కుతోంది.
విశేషం ఏంటంటే.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ ఈ సిరీస్లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘రాజా’. 1995లో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్. ఆ తర్వాత ‘మొహబ్బత్’ (1997) సినిమాలో మళ్లీ కలసి నటించారు. ఇన్నేళ్లకు మళ్లీ కలసి నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ జరుగుతోంది.
#
Tags