మనాలీలో.. యాక్షన్‌

Published on Tue, 09/13/2022 - 03:44

‘యోధ’ కోసం మనాలీ వెళ్లారు హీరోయిన్ రాశీఖన్నా. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓజా ద్వయం తెరకెక్కిస్తున్న సినిమా ‘యోధ’. ఈ యాక్షన్  ఫిల్మ్‌లో దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. అయితే కొంత ప్యాచ్‌వర్క్‌ కోసం మనాలీ వెళ్లింది ‘యోధ’ చిత్రబృందం.

షూట్‌లో పాల్గొంటున్న విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్ స్టా ద్వారా తెలిపారు రాశీ ఖన్నా. ఇందులో రాశీ ఖన్నా కొన్ని యాక్షన్ సీన్ కూడా చేశారన్నది బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కాకుండా తమిళంలో కార్తీ ‘సర్దార్‌’, తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ