గోదావరిఖని రిఫరెన్స్‌తో.. 22 ఎకరాల్లో పల్లెటూరు సెట్‌

Published on Thu, 03/16/2023 - 08:46

‘‘దసరా’ కథకు తగ్గట్టు భారీ విలేజ్‌ సెట్‌ వేశాం. ఇల్లు, స్కూల్, మైదానం, బార్‌.. ఇలా ఐదు వందల మంది నివసించే పల్లెటూరుని సహజంగా సృష్టించాం. 98 శాతం షూటింగ్‌ ఈ సెట్‌లోనే జరిగింది’’ అని ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల అన్నారు. నాని హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ అవుతోంది.

ఈ మూవీ ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల మాట్లాడుతూ– ‘‘నానీ గారితో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెర్సీ, శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలు చేశాను. నాకు పేరు వచ్చే కంటెంట్‌ ఉన్న సినిమాలు నానిగారి వల్లే వచ్చాయి. ఆయన గత సినిమాలతో పోల్చితే ‘దసరా’ చాలా డిఫరెంట్‌ మూవీ. సంస్కృతి పరంగా 25 ఏళ్ల క్రితం నాటి ఊరు ఇందులో కనిపిస్తుంది. ఈ సెట్‌ కోసం గోదావరిఖని రిఫరెన్స్‌ తీసుకున్నా. దాదాపు 22 ఎకరాల్లో రెండున్నర నెలలు 800 మందికిపైగా పనిచేసి సెట్‌ వేశాం. శ్రీకాంత్‌ ఓదెలకి తొలి సినిమా అయినా అన్ని విషయాలపై చాలా క్లారిటీ ఉంది. ప్రస్తుతం శంకర్‌– రామ్‌ చరణ్‌గారి మూవీ, నానీగారి 30వ చిత్రం, అఖిల్‌ ‘ఏజెంట్‌’ సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ