‘జాతిరత్నాలు సినిమాను నిషేధించాలి’

Published on Thu, 03/25/2021 - 15:13

సాక్షి, కాచిగూడ: జాతిరత్నాలు సినిమాలో స్వాతంత్ర సమరయోధులను కించపరిచారని, సినిమా దర్శకుడు, నిర్మాత, నటులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శివసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భూమా గంగాధర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్‌ ఫరోషికీ తమన్నా హబ్‌ హమారే దిల్‌ మీ హై.. కవితను జాతిరత్నాలు సినిమాలో సర్‌ ఫరోషికీ తమన్నా, సమంతా, రష్మిక, తీనోసాథ్‌ హాయ్‌.. అంటూ వెటకారంగా పాడి అవమానించారని తెలిపారు.

నేటి తరానికి తప్పుడు సందేశాన్ని  అందించిన సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్‌ డైరెక్టర్, కవితను ఆలపించి అవమానపరిచిన గాయకులపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివసేన నేతలు కంజర్ల శ్రీధరాచారి, రితేష్, శ్రీనివాసాచారి, సురేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: 
ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్‌ కాదు!

సీఎం జగన్‌ ప్రకటన.. చిరంజీవి హర్షం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ