amp pages | Sakshi

మొదటిరోజు మోనో ఖాళీ!

Published on Tue, 10/20/2020 - 14:09

సాక్షి, ముంబై: మోనో రైళ్లు ప్రారంభించిన మొదటి రోజు ముంబైకర్ల నుంచి అత్యల్ప స్పందన వచ్చింది. ప్రయాణికులు లేక దాదాపు రైళ్లన్ని ఖాళీగానే తిరిగాయి. ప్రతీ బోగీలో వేళ్లపై లెక్కించే విధంగా ప్రయాణికులు కనిపించారు. దీంతో అధికారుల ఆర్థిక అంచనాలు తారుమారు కావడంతో తలలు పట్టుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడు నెలలుగా షెడ్డుకే పరిమితమైన మోనో రైళ్లు అదివారం నుంచి ప్రారంభమైన విషయ తెలిసిందే. చెంబూర్‌–వడాల–సాత్‌రాస్తా మార్గం మీదుగా రాకపోకలు సాగించే మోనో రైళ్లకు ముంబైకర్ల నుంచి స్పందన రాకపోవడంతో అధికారులు అయోమయంలో పడిపోయారు.  

బోగీకి 10 మందే.. 
చెంబూర్‌ స్టేషన్‌ నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలకు మొదటి రైలు బయలుదేరింది. ఆ తరువాత 20 నుంచి 30 నిమిషాలకొక రైలును నడిపారు. లోకల్‌ రైళ్లలో మాదిరిగా అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులను కాకుండా మోనోలో అందరిని అనుమతించారు. ముఖానికి మాస్క్‌ ధరించిన వారిని అనుమతించడంతో పాటు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ప్రతీ ప్రయాణికుడి టెంపరేచర్‌ పరీక్షించారు. చేతులు శానిటైజ్‌ చేసి ప్లాట్‌ఫారంపైకి పంపించారు. అయినప్పటికీ ప్రయాణికులు ముఖం చాటేశారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రతీ బోగీలో 30 మంది కంటే ఎక్కువ అనుమతించరాదని అధికారులు సూచించారు.
(చదవండి: కరోనా ఎఫెక్ట్‌తో స్వయం ఉపాధిలోకి.. )

కాని వాస్తవ పరిస్థితులు అందుకు బిన్నంగా కనిపించాయి. ఏ బోగీలో చూసిన 10–12 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే ఆదివారం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థల కార్యాలయాలకు సెలవు ఉంది. దీంతో మొదటిరోజు ప్రయాణికులు లేక రైళ్లన్ని ఖాళీగా తిరిగి ఉండవచ్చని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. సోమవారం నుంచి పూర్తి సామర్థ్యంతో పరుగులు తీస్తాయని భావిస్తున్నారు. లోకల్‌ రైళ్లలో సామాన్యులకు అనుమతివ్వడం లేదు. దీంతో ఈ రైళ్లు కూడా పూర్తి సామర్థ్యంతో తిరగడం లేదు. నేలపై తిరిగే లోకల్‌ రైల్వే స్టేషన్లతో పైనుంచి వెళ్లే మోనో స్టేషన్లకు అనేక చోట్ల కనెక్టివిటీ చేశారు. కానీ, లోకల్‌ రైళ్లలో ప్రయాణికులు అంతంత మాత్రమే ఉంటున్నారు. దీంతో మోనో రైళ్లు ఖాళీగా తిరగడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.   
(చదవండి: బాలీవుడ్‌ తరలింపు అంత ఈజీ కాదు)

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)