డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Breaking News
బైక్ ప్రమాదంలో ఎన్ఎస్జీ కమాండో మృతి
Published on Thu, 05/25/2023 - 07:10
యశవంతపుర: బైకు నుంచి జారిపడడంతో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)లో బ్లాక్ క్యాట్ కమాండోగా పని చేస్తున్న జవాన్ మృతి చెందారు. చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా తణిగేబైలుకు చెందిన దీపక్ (31) ఎన్ఎస్జీలో పని చేస్తున్నారు. నెలరోజుల పాటు సెలవు పెట్టి సొంతూరుకు వచ్చారు. నెల రోజులు ఇక్కడ ఉండాలి కాబట్టి సరదాగా తిరగడానికని సొంతంగా ఒక బైకును కొన్నారు. సెలవులు ముగియడంతో బైకుపై చిక్కమగళూరు నుంచి బెంగళూరుకు బయలుదేరారు.
బెంగళూరుకు దగ్గరలో వర్షాల వల్ల రోడ్డు అధ్వానంగా ఉన్నచోట బైకు జారిపడడంతో దీపక్కు తలకు తీవ్ర గాయాలై మృతి చెందారు. ఆర్మీలో చేరి ఉత్తమ పనితీరు కనబరచిన దీపక్ను ఉన్నతాధికారులు దేశంలో అత్యంత ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే ఎన్ఎస్జీ కమాండోగా ఎంపిక చేశారు. కఠినమైన శిక్షణ కూడా పూర్తిచేసుకుని ఇటీవలే అందులో చేరారు. కానీ అంతలోనే విధి చిన్నచూపు చూసింది.
Tags