వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థులకు లేఖన సామగ్రి వితరణ
Published on Wed, 03/29/2023 - 00:50
బనశంకరి: బెంగళూరు శివాజీనగర ప్రభుత్వ తెలుగు ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎస్ఎస్ఎల్సీ పరీక్షలకు హజరవుతున్న విద్యార్థులందరికీ లేఖన సామగ్రిని ఉచితంగా అందజేశారు. దాత హరిబాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదరికం చదువుకు ఆటంకం కారాదని, ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. టాపర్లుగా నిలిచే విద్యార్థులకు మంచి బహుమతులు ఇస్తానని ప్రకటించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రంగస్వామినాయుడు మాట్లాడుతూ... దాతలు, తెలుగు పత్రికల అండతోనే ప్రభుత్వ తెలుగు పాఠశాలలు రాణిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
#
Tags