ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
సౌత్ ఇండియా సైన్స్ డ్రామా పోటీలకు ‘పారమిత’ విద్యార్థులు
Published on Sun, 11/12/2023 - 01:24
కరీంనగర్: కేంద్ర సాంస్కృతికశాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూ జియమ్స్ వారు నిర్వహించే జిల్లా, రాష్ట్ర , ప్రాంతీ య, జాతీయస్థాయి సైన్స్ డ్రామా పోటీలలో పారమిత హైస్కూల్ మంకమ్మతోట విద్యార్థి బృందం వరుసగా రెండో సంవత్సరంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కై వసం చేసుకొని సౌత్ ఇండి యా లెవెల్ పోటీలకు అర్హత సాధించింది. ఈ వి ద్యాసంవత్సరంలో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘చిరుధాన్యాలు అద్భుతమైన ఆహారం’ అనే అంశంపై జిల్లాస్థాయి ప్రదర్శనలో మొదటిస్థా నం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ నెల 6వ తేదీన ఎస్సీఈఆర్టీ గోదావరిహా ల్ హైదరాబాద్లో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. పారమిత విద్యార్థులు మొదటిస్థానాన్ని పొంది ఈ నెల 23న బెంగళూరు లోని విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యుజియంలో దక్షిణ భారతదేశస్థాయిలో జరిగే పో టీల్లో పాల్గొననున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి త న కార్యాలయంలో శనివారం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. గైడ్ టీచర్ బాలస్వాతి, డా న్స్, ఆర్ట్ టీచర్స్ మధు, మోహన్, ఎస్.చిరంజీవచా రి, స్క్రిప్ట్రైటర్ మహేశ్లను పారమిత పాఠశాలల అధినేత డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు అభినందించారు.
Tags