హిజాబ్‌ హీట్‌: పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్‌ ‘జామీ ఆలివర్‌’ మృతి

Published on Sun, 10/30/2022 - 21:12

టెహ్రాన్‌: ఇరాన్‌లో హిజాబ్‌ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు తీవ్రంగా కొట్టటం వల్ల ప్రముఖ చెఫ్‌ మెహర్షాద్‌ షాహిదీ అలియాస్‌ ‘జామీ ఆలివర్‌’ మృతి చెందటం కలకలం సృష్టించింది. ఆయన అంత్యక్రియలకు శనివారం వేలాది మంది హాజరయ్యారు. మెహర్షాద్‌ షాహిదీ 20వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. 

అరక్‌ సిటీలో మెహర్షద్‌ షాహిదీని అదుపులోకి తీసుకున్నారు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌. వారు తీవ్రంగా కొట్టటం ద్వారా మెహర్షద్‌ షాహిదీ పుర్రె దెబ్బతిని బుధవారం మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘అరెస్ట్‌ చేసిన తర్వాత లాఠీతో కొట్టటం ద్వారానే మా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ఒత్తిడి కారణంగా గుండె పోటుతో మరణించాడని చెప్పాల్సి వచ్చింది.’ అని బాధితుడి బంధువు ఒకరు ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ టీవీకి తెలిపారు. మెహర్షద్‌ షాహిదీ గుండెపోటుతోనే మరణించాడని చెప్పాలని అధికారులు ఒత్తిడి చేశారని ఆయన కుటుంబం సభ్యులు సైతం వెల్లడించారు. మెహర్షద్‌ షాహిదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 25వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆయన చేసిన వంటలు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. 

ఇదీ చదవండి: హిజాబ్‌ ధరించలేదని పోలీసుల టార్చర్‌?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ