amp pages | Sakshi

టెన్త్‌ పరీక్షలు ముగిశాయ్‌

Published on Thu, 03/28/2024 - 01:40

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు అధికార యంత్రాంగం చేసిన విస్తృతమైన ఏర్పాట్లతో ఈనెల 18న పరీక్షలు మొదలైన రోజు నుంచి గుంటూరు జిల్లాలో ఎక్కడా.. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన ఆనందంలో విద్యార్థులు ఉత్సాహంగా కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత గుంటూరు జిల్లాలో తొలిసారిగా జరిగిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మాల్‌ ప్రాక్టీసులకు తావు లేని విధంగా జరగడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. పరీక్ష కేంద్రా ల ఏర్పాటు మొదలు, వసతుల కల్పన, కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ను పోలీస్‌ స్టేషన్ల నుంచి పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పరీక్ష జరిగిన తరువాత ఆన్సర్‌ పేపర్లను పకడ్బందీగా ఏర్పాట్ల మధ్య తిరిగి పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేయడం వంటి అన్ని అంశాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలతో జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరీక్షల మానిటరింగ్‌ విభాగం నిరంతరం పరీక్షల సరళిని పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఇటు అధికారులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో నిముషం ఆలస్యం నిబంధన ఏదీ లేకపోవడంతో పాటు పరీక్షలు జరిగిన రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క విద్యార్థి సైతం ఆలస్యంగా వచ్చారనే కారణంతో పరీక్షకు అనుమతించని సంఘటన సైతం చోటు చేసుకోలేదు. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గాను 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

మాల్‌ ప్రాక్టీసులు లేని విధంగా సరికొత్త రికార్డు గుంటూరు జిల్లాలో ఇదే ప్రథమం

Videos

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)