ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
జాతీయ తైక్వాండో పోటీలకు కార్తికేయ ఎంపిక
Published on Sat, 11/18/2023 - 01:58
నిజాంపట్నం: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు పీతా కార్తికేయ ఎంపిక కావడం హర్షణీయమని కోచ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన స్టెర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలు ఈనెల 14, 15 తేదీల్లో రేపల్లె బోధి ధర్మ జిమ్, తైక్వాండో అకాడమీలో జరిగాయి. పోటీల్లో గుంటూరు జిల్లా టీమ్ తరపున నిజాంపట్నంకు చెందిన పీతా కార్తికేయ బంగారు పతకాన్ని సాధించగా, పీతా తనూష వెండి పతకం సాధించింది.బంగారు పతకాన్ని సాధించిన పీతా కార్తికేయ నవంబర్ 30 నుంచి జరిగే జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
పతకాలు సాదించిన ఇద్దరు విద్యార్థినిలను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, ఆయన సోదరుడు మోపిదేవి హరనాథబాబు, బోటు ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు, ఏపీ సీఫుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామకృష్ణ తదితరులు అభినందించారు.
Tags