amp pages | Sakshi

విద్యావ్యవస్థకు ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌

Published on Sun, 06/12/2022 - 00:47

ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతిలో ఉత్తీర్ణతా శాతం తగ్గిన నేపథ్యంలో రకరకాల చర్చలూ, విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి గత కొన్నేళ్లుగా పదో తరగతిలో పాస్‌ కాకపోవడం అనేది అలవాటు లేకుండా పోయింది. పరీక్షల సమయంలో చూసీచూడనట్టుగా పోవడమూ ఒక కారణం. ఈసారి కోవిడ్‌ మహమ్మారితో పాటు కొంత కఠినంగా వ్యవహరించడం వల్ల కూడా ఫలితాలు తగ్గాయి. దీనివల్ల కొంపలేమీ మునగవు. సప్లిమెంటరీ ఉండనే ఉంది. అయితే ఫలితాల వాపెంతో, బలుపెంతో తెలుసుకొని, విద్యార్థులనూ, మొత్తంగా విద్యా వ్యవస్థనూ మున్ముందు దిద్దుకోవడానికి ఈ ఫలితాలు చక్కగా ఉపకరిస్తాయి.

తప్పు పిల్లలదే కాదు...
తెలుగు రాష్ట్రాల్లో  ఎస్‌ఎస్‌సీ ఫలితాలు అంటేనే చిట్టీలు రాసి పాస్‌ కావడం. విద్యా శాఖ అధికారులూ, కలెక్టర్లూ తమ జిల్లాలో తక్కువ మంది పాస్‌ అయితే ఎక్కడ తమకు చెడ్డ పేరు వస్తుందోనని బోగస్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే వారు. కానీ ఈసారి ఎగ్జామ్స్‌ చాలా కఠినంగా నిర్వహించ డంతో అసలైన పరిస్థితి ఏమిటో బయటపడింది. గత 20, 30 ఏళ్ల నుంచీ విద్యా వ్యవస్థలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడింది. కలెక్లర్లు, అధికార్లు పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు టార్గెట్లు నిర్దేశించే పరిస్థితుల్లో పరీక్షలు రాసే సమయంలోనే కొంత మెతక ధోరణిని విద్యార్థుల పట్ల ప్రదర్శించడం ఉండేది.

పరీక్షా పేపర్లు దిద్దే సమయంలో కూడా ఆయా కేంద్రాల్లోని అధిపతులు టీచర్లను ప్రభావితం చేస్తారు. ‘‘బార్డర్‌లో ఉన్న విద్యార్థులను రెండు మూడు మార్కుల కోసం వారిని ఫెయిల్‌ చేయకండి... పాస్‌ చేయండి’’ వంటి ఒత్తిళ్లు ఉండేవి. పార్ట్‌ –ఏ, పార్ట్‌ –బీలో రెండు మూడు మార్కులు కలిపేవారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పరీక్షల సమయంలో కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అరెస్టు అయ్యారు. దీని ప్రభావం వారిపై పడింది. అరెస్టు కావడం అవమానకరంగా భావించి వారంతా పరీక్షల నిర్వహణలో కాపీ జరుగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. 

ఇక రెండోది... కోవిడ్‌ అంశం కూడా చెప్పుకోవాలి. కోవిడ్‌ సమయంలో విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి వీల్లేకపోవడం, విద్యార్థుల్లో ఉదాసీనత పెరగడంతో సీరియస్‌గా చదువు సాగలేదు. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టులు మరిచిపోయారు. ప్రధానంగా 8, 9 తరగతుల విద్యార్థులు ఎక్కువ ప్రభావిత మయ్యారు. దీంతో పదో తరగతి ఫలితాలు తగ్గాయి. దీర్ఘకాలంలో ఈ పరిణామం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలాంటి అవసరమైన షాక్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విద్యార్థులు, టీచర్లలో సీరియస్‌నెస్‌ పెరుగుతుంది. 

కోవిడ్‌ వల్ల సరిగా చదవలేక పోయినందువల్ల ఆం్ర«ధప్రదేశ్‌ ప్రభుత్వం.. నెలరోజులు రెసిడెన్షియల్‌ తరహాలో సెలవుల సమయంలోనూ పిల్లలకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. దీంతో త్వరలో నిర్వహించనున్న çసప్లిమెంటరీ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత శాతం 95 శాతానికి వెళ్తుంది. విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా ఉండటానికి సప్లిమెంటరీ పరీక్షల ఫీజులను కూడా ప్రభుత్వం రద్దు చేయడం మంచి పరిణామం.

పదవ తరగతిలో ఉత్తీర్ణతను రాజకీయ కోణంలో చూడవద్దు. దానిని విద్యాశాఖ అధికారులకు వదిలిపెట్టాలి. ఏపీలో విద్యా శాఖ అధికారులు కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారు. ‘నాడు–నేడు’ ‘జగన్‌ విద్యా కానుక’ సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇస్తున్న మద్దతుతో అధికారులు కొనసా గిస్తున్నారు. విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ బ్రహ్మాండగా ముందుకు వెళ్తోంది. ఏ రాజకీయ పార్టీ కూడా దీనిని రాజకీయ కోణంలో చూడవద్దు. అలా చేస్తే విద్యా వ్యవస్థకు నష్టం చేసిన వారవుతారు.

పదో తరగతి ఫలితాలు తగ్గడంలో తప్పు కేవలం పిల్లలదే కాదు... అది ప్రాధమ్యాలని బట్టి వరుసగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, మేధావులది. టీవీ సీరియళ్ల మీదా, దేవుని పూజల మీదా, అలంకారాల మీదా జీవితం పారేసుకున్న తల్లులూ; నాలుగురాళ్ల సంపాదన మీదా, మందు మీదా, స్నేహాలూ, బాతఖానీల మీదాజీవితం పరిచేసుకున్న తండ్రులూ; పీఆర్సీలూ, అదనపు సంపాదనలూ, సొంత బాదర బందీలూ, బాధ్యతలేని తనాలతో టీచర్లూ; పనికి రాని, అర్థం లేని, కాలానికి నిలబడలేని, ఆకర్షణ లేని పాఠ్యపుస్తకాలూ, టీచర్ల శిక్షణలతో ప్రభుత్వాలూ; సినిమాల గురించీ, దేవుళ్ల గురించీ, మతం గురించీ, దమ్మిడీ పనికిరాని సమాచారం గురించీ ప్రచారం చేస్తూ... సమీప పాఠశాలల్లోని పిల్లలతో ఎన్నడూ మాట్లాడని మేధావులూ... అందరూ బాధ్యత వహించాలి!

ఇంజినీరింగ్‌ చదివే విదార్థికి కూడా ఒక వాక్యం ఇంగ్లిష్‌లోనో లేదా కనీసం మాతృభాషలోనైనా తప్పులేకుండా రాయలేని దుఃస్థితిలో ఉన్న పరిస్థితి మనది. చదువు విలువని సమర్థ వంతంగా నూరి పోయడంలో విఫలమైన సమాజం మనది. కేవలం చదువుకుంటేనే జీవితం అద్భుతంగా ఉంటుందని నచ్చ జెప్పడంలో విఫలమైన వ్యవస్థ మనది. చదువులో మార్పు గురించో, పుస్తకాలలోని పాఠాల గురించో, సిలబస్‌ గురించో, చదువుచెప్పే టీచర్ల గురించో చర్చించుకోవడం కూడా రాజకీ యమైపోయిన పరిస్థితుల్లో బతుకుతున్నందుకు ముందు మనం సిగ్గుపడదాం. మార్పు గురించి మాట్లాడితే బూతులు మాత్రమే బదులిచ్చే సంస్కృతిని చూసి చచ్చిపోదాం!


వ్యాసకర్త: ఆకునూరి మురళి, మాజీ ఐఏఎస్‌ అధికారి


 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)