amp pages | Sakshi

చల్లగా... సంస్కరణలు

Published on Thu, 09/24/2020 - 01:08

హడావుడి లేదు. ఆర్భాటం అసలే లేదు. చడీచప్పుడూ లేకుండా దేశంలో నాలుగురోజుల వ్యవధిలో భారీ సంస్కరణలు పట్టాలెక్కాయి. మొన్నటికి మొన్న సాగు రంగ సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులకు మూజువాణి ఓటుతో పార్లమెంటు ఆమోదముద్ర పడింది. కార్మిక చట్టాలను సంస్కరించే మరో మూడు బిల్లులు సైతం  పార్లమెంటులో బుధవారం మూడు గంటల చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఈ మూడు బిల్లులూ మూడు కోడ్‌లుగా వున్నాయి– కార్మికుల వృత్తిపరమైన భద్రత, వారి ఆరోగ్యం, పని పరిస్థితులపైనా... పారిశ్రామిక సంబంధాల పైనా... కార్మికుల సామాజిక భద్రతపైనా వీటిని రూపొందించారు. మిగిలినవాటి మాటెలావున్నా మొదటి రెండు బిల్లులపైనా కార్మిక సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఇవి రాష్ట్రాల పరిధిలోకి జొరబడి, వాటి హక్కుల్ని దెబ్బతీస్తున్నాయని కేరళవంటి రాష్ట్రాలు ఆరోపిస్తుంటే... ఆరెస్సెస్‌ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌) సైతం పారిశ్రామిక సంబంధాల కోడ్‌  కార్మికులకు వ్యతిరేకంగా వున్నదని ఆరోపిస్తోంది. నిరుడు మే నెలలో రెండోసారి ఘన విజయం సాధించాక జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సంపద సృష్టి, సంపద పునఃపంపిణీలను ప్రస్తావించారు. ఆ రెండింటినీ ప్రస్తావించారంటేనే తన రెండో దశ పాలనలో అందుకు తగ్గ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చాలామంది జోస్యం చెప్పారు. ఇప్పుడదే జరుగుతోంది. సాధారణంగా అయితే అమల్లో వున్న విధానాలను సమూలంగా మార్చే ఈ మాదిరి సంస్కర ణలు తీసుకురావడం అంత సులభం కాదు.

పార్లమెంటులో వాగ్యుద్ధాలు, సభల వాయిదాలు, సమ్మె పిలుపులు, ఆందోళనలు రివాజు. కానీ కరోనా అనంతర పరిస్థితులు దాన్నంతటినీ మార్చేశాయి. అనేకానేక పరిమితుల మధ్య పార్లమెంటు సమావేశంకాగా... ఉద్యోగ భయం, జీతాల కోత వగైరాలతో భవిష్యత్తుపై బెంగతో కార్మికులు, బడుగు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాల ఆంక్షలతో పాటు, కరోనా అంటేవున్న భయాందోళనల వల్ల సమీకరణ కూడా అసాధ్యం. వీటి అవసరం లేకుం డానే ఇంత ముఖ్యమైన సంస్కరణలపై లోతైన చర్చలు జరిగితే అవి మనం అనుసరిస్తూ వస్తున్న ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిబింబించేవి. సాగు రంగ సంస్కరణల బిల్లుల విషయంలో సభలో విపక్షాలు వున్నా చర్చలు సరిగా సాగలేదు. ఇప్పుడు కార్మిక రంగ సంస్కరణల బిల్లులకైతే దాదాపుగా విపక్షాలే సభలో లేవు. 

కార్మిక చట్టాల ప్రధానోద్దేశం కార్మికుల హక్కుల్ని పరిరక్షించడం, అదే సమయంలో యాజ మాన్యాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడటం. ఇప్పుడు అమల్లోవున్న చట్టాలు కార్మిక హక్కుల పరిరక్షణపై అతిగా శ్రద్ధ చూపుతున్నాయని పరిశ్రమల యజమానులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇవి కార్మికులకు ఉపయోగపడటం మాటెలావున్నా అధికారుల అవినీతికి దారితీస్తున్నాయి. చూసీ చూడనట్టు పోవడం కోసం భారీగా సొమ్ము చేతులు మారుతోంది. చాలా పరిశ్రమల్లో రిజిస్టర్‌లో వుండే కార్మికులకూ, వాస్తవంగా పనిచేసే కార్మికుల సంఖ్యకూ పొంతన వుండదు. అందువల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు మరణించినా, శాశ్వతంగా వికలాంగులైనా వారిపై ఆధారపడే వారికి ఏ అండా లేకుండా పోతోంది. కనుక పారదర్శకమైన, అందరికీ ప్రయోజనకరమైన చట్టాలు వుంటే మంచిదే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలకు అందుకు దోహదపడతాయా? మన దేశంలో వాస్తవంగా కార్మిక చట్టాలెలా వున్నాయో చెప్పడానికి దేశం నలుమూలలా లాక్‌డౌన్‌ సమ యంలో స్వస్థలాలకు నిత్యం నడుచుకుంటూ పోయిన వేలాదిమంది వలసజీవులే సాక్ష్యం. సంవత్స రాల తరబడి వారు చేసే చిన్నా చితకా ఉద్యోగాలు, పనులు ఏ చట్టం కిందికీ రాకపోవడం వల్ల హఠా త్తుగా వారు రోడ్డున పడ్డారు. సాయం చేయడం మాట అటుంచి, అత్యధికశాతం యజమానులు వారికి ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా ఎగ్గొట్టి వెళ్లగొట్టారు. కార్మిక చట్టాలు పటిష్టంగావుంటే అది అసాధ్యమ య్యేది. చిత్రమేమంటే లాక్‌డౌన్‌ సమయంలో యూపీ, ఎంపీ రాష్ట్రాలు కార్మికుల పనిగంటలు పెంచుతూ ఆర్డినెన్సులు తీసుకొచ్చాయి. పెద్దయెత్తున నిరసనలు రావడంతో అవి నిలిచిపోయాయి.

ఇప్పుడు ఆమోదం పొందిన మూడు బిల్లులూ 350 పేజీల్లో, 411 క్లాజులతో, 13 షెడ్యూళ్లతో వున్నాయి. ఇంత విస్తృతమైన బిల్లులపై మూడు గంటల వ్యవధిలో చర్చ పూర్తయిందంటే వింతగానే వుంటుంది. నియామకాల్లో, తొలగింపులో ఎక్కువ నిబంధనలు యాజమాన్యాలకే అనుకూలంగా వున్నాయని... వివాద పరిష్కార విధానాలు సైతం కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసేలా వున్నాయని బీఎంఎస్‌ ఆరోపిస్తోంది. పైగా తాము, ఇతర కార్మిక సంఘాలు లోగడ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని, పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల్ని కూడా సరిగా పట్టించు కోలేదని చెబుతోంది. ఇంతక్రితం వందలోపు కార్మికులున్న పరిశ్రమల్లో ప్రభుత్వాల ముందస్తు అను మతి లేకుండా లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్‌లు చేయొచ్చు. లేదా మూసివేయొచ్చు. ఇప్పుడది 300మంది కార్మికులుండే పరిశ్రమలకు వర్తింపజేస్తూ మార్చారు. అలాగే జాతీయ స్థాయి పారిశ్రామిక ద్విసభ్య ట్రిబ్యునళ్లలో రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితోపాటు కార్మిక సంబంధ అంశాల్లో పరిజ్ఞానం, అనుభవం వున్న ఒకరికి చోటు చోటు కల్పించాలని ముసాయిదాలో వుంటే ప్రస్తుత బిల్లులో దాన్ని ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదావున్న వ్యక్తికి కట్టబెట్టారు. గుర్తింపు కార్మిక సంఘాల విషయంలోనూ, సమ్మె నోటీసు విషయంలోనూ తాజా నిబంధనలు కఠినంగా వున్నాయి. మారిన ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు సంస్కరణలు తీసుకురావడం ఎంత అవసరమో, అవి మెజారిటీ ఆమోదం పొందేలా, ఏకాభి ప్రాయ సాధన దిశగా వుండటమూ అంతే అవసరం. అప్పుడే వాటి ఉద్దేశిత లక్ష్యాలు నెరవేరతాయి. అటు సాగు రంగ సంస్కరణల్లోనూ, ఇటు కార్మిక రంగ సంస్కరణల్లోనూ ఆ భావన లేకపోవడం విచారకరం. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)