Tirumala: నిలువు దోపిడి ఇచ్చివచ్చేసరికి.. ఇంట్లో చోరీ..

Published on Tue, 06/29/2021 - 11:12

సాక్షి, భీమారం: గ్రేటర్‌ వరంగల్‌ పరిధి 56వ డివిజన్‌లోని టీఎన్జీవోస్‌కాలనీలో చోరీ జరిగింది. ఈ ఘటనలో 15తులాల బంగారం, రూ.50వేలు నగదు అహహరణకు గురైంది. కేయూ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. టీఎన్జీవోస్‌ కాలనీకి చెందిన అద్దంకి నాగేశ్వర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 25న దైవదర్శనానికి తిరుమల వెళ్లి 28న తిరిగి వచ్చారు. అయితే, అప్పటికే వంట గదిపక్కన ఉన్న తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి బీరువా ధ్వంసం చేయడంతో పాటు బట్టలు చిందరవందరంగా పడి ఉన్నాయి.

అందులో దాచిన బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో మంగళవారం కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వేలిముద్రల నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారభించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

చదవండి: 6 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్‌.. ప్రియునితో కలిసి...

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ