నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విధులకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..
Published on Fri, 02/18/2022 - 06:47
సాక్షి, ఒడిశా(కొరాపుట్): జిల్లాలోని సిమిలిగుడ పట్టణ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న 26వ నంబరు జాతీయ రహదారిలో గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సిమిలిగుడకు చెందిన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ పండా(40) మృతి చెందారు. ఉప్పర మనియా గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ఉదయం విధుల నిమిత్తం స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా, దుర్ఘటనకు గురైంది.
రోడ్డుకు అడ్డంగా కొన్ని ఆవులు రావడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి రాయ్పూర్కు వెళ్తున్న ఓ కంటైనర్ ఆమెపై నుంచి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కంటైనర్ డ్రైవర్ని అరెస్ట్ చేసి, పోలీస్స్టేషన్కు తరలించారు.
#
Tags