amp pages | Sakshi

ధాన్యం కేసులో టీడీపీ నేత, మరో ఐదుగురి అరెస్ట్‌

Published on Tue, 11/10/2020 - 05:09

నెల్లూరు (క్రైమ్‌): రైతుల నుంచి కారు చౌకగా ధాన్యాన్ని కొనుగోలు చేసి, ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేసిన టీడీపీ నేతతో పాటు మరో ఐదుగుర్ని నెల్లూరు రూరల్‌ సబ్‌ డివిజన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత జి.జయపాల్, మనుబోలు మండలం లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత కరియావుల మధుసూదన్‌రావు ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులు.

వీరు కొంతమంది దళారులు, రైస్‌ మిల్లర్లతో కలిసి రైతుల నుంచి అతి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. వాటిని తామే పండించినట్టు చూపించి వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించారు. దీనిని గుర్తించిన డీఆర్‌డీఏ ఇందుకూరుపేట ఏరియా కో–ఆర్డినేటర్‌ కనుపూరు శ్రీనివాసులు ఈ నెల 3న వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు టీడీపీ నేత కరియావుల మధుసూదన్‌రావు, గుంటూరు జిల్లా కర్లపాలెంకు చెందిన శ్రీలక్ష్మి వెంకటసాయి మణికంఠ రైస్‌మిల్లు యజమాని బి.శ్రీనివాసరావు, కోవూరు మండలం ఇనుమడుగు గ్రామానికి చెందిన పి.మల్లికార్జునరెడ్డి, వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఉప్పు పద్మనాభం, వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన మస్తాన్, కిశోర్‌లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన టీడీపీ నేత జయపాల్‌ పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. 

Videos

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)