amp pages | Sakshi

'పర్‌ఫెక్ట్'‌ కంపెనీ గుట్టురట్టు చేసిన సిట్‌

Published on Thu, 08/06/2020 - 10:56

సాక్షి ప్రతినిధి, ఒంగోలు :మద్యానికి బానిసైన వారు మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. కురిచేడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు ‘‘పర్‌ఫెక్ట్‌’’గా సాగుతోంది.  ఘటన జరిగి ఐదు రోజులు గడవక ముందే అందుకు కారణమైన పర్‌ఫెక్ట్‌ కంపెనీ మూలాలను పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా మెడికల్‌ షాపుల్లో తనిఖీలు చేస్తూ వెళ్లిన సిట్‌ బృందం ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేస్తున్న నకిలీ శానిటైజర్‌ గుట్టును రట్టు చేసింది. కనీసం ఈ శానిటైజర్‌ తయారీ కేంద్రంలో సాంకేతిక నిపుణులు గానీ కనీసం చదువుకున్న వారు గాని లేని పరిస్థితి. గ్రామాల్లో కూలీ పనులు చేసుకునే వారిని ఓ గోడౌన్‌లో ఉంచి వారి చేత శానిటైజర్‌ పేరుతో నకిలీవి తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం పోలీసు దర్యాప్తులో బయటపడింది. దీనికి సంబంధించి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్‌ బృందం అసలైన సూత్రధారులను పట్టేపనిలో పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్‌ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి 

ఇళ్ల వద్ద పర్‌ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్‌ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్‌ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్‌ఫెక్ట్‌ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్‌ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్‌ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్‌ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్‌ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్‌లో అక్రమంగా తయారవుతున్న పర్‌ఫెక్ట్‌ కంపెనీ కేంద్రాన్ని పట్టుకున్నారు.  

అంతా అక్రమమే.. 
పర్‌ఫెక్ట్‌ కంపెనీ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సిట్‌ బృందానికి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని చూసి ఒళ్లు జలదరించింది. కనీసం ఒక్క టెక్నికల్‌ పర్సన్‌ కూడా లేకుండా చదువులేని గ్రామీణ ప్రాంతాల కూలీలను తీసుకొచ్చి శానిటైజర్‌ పేరుతో ఏదో ద్రవాన్ని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. శానిటైజర్‌లో ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్, ప్రొఫనాల్‌ కాకుండా మిథైలిన్‌ క్లోరైడ్‌ (డీసీఎం) ను ఉపయోగించి శానిటైజర్‌ తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ మిథైలిన్‌ క్లోరైడ్‌ ప్రమాదకరమైనదని దానిని శానిటైజర్‌లో వాడకూడదని నిపుణుల ద్వారా తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు. అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఫ్యాక్టరీ పేరుతో చూపుతున్న అడ్రస్, జీఎస్టీ, ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వంటివి అన్ని తప్పుడు వాటిని సృష్టించి శానిటైజర్‌ తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి వద్ద నుంచి కురిచేడులో మెడికల్‌ షాపు నిర్వాహకులు ఎంతమంది కొనుగోలు చేసి వీటిని అమ్మారనే విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు. మెడికల్‌ షాపు నిర్వాహకులకు విషయం తెలిసినా బయటపడటం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తాగడం వల్లే కురిచేడులో అధిక శాతం మరణాలు సంభవించాయని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు   తెలుస్తోంది. 

ఎవరినీ వదలం.. – ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ 
కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశాం. ఇప్పటికే సిట్‌ అధికారులు పర్‌ఫెక్ట్‌ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీని సీజ్‌ చేసి అందులో నిషేధిత మిథైలిన్‌ క్లోరైడ్‌ను కలుపుతున్నట్లుగా గుర్తించాం. ఇది ప్రమాదకరమైన కెమికల్‌. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇందులో కురిచేడులోని మెడికల్‌ షాపు నిర్వాహకులకు ఎంతమందికి సంబంధాలున్నాయనే దానిపై ఆరా తీస్తున్నాం. అది నిజమని తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం.  

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)