amp pages | Sakshi

ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు..

Published on Fri, 03/26/2021 - 14:03

సాక్షి, భువనేశ్వర్: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ పెట్టి బాలికలను విక్రయించే ఓ ముఠా పోలీసులకు చిక్కింది. ఆ ముఠాలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ ప్రాంతం సునాబెడ గ్రామానికి చెందిన బాలికకు పని కల్పిస్తామని తల్లిదండ్రులను నమ్మించి తీసుకువెళ్లిన దుండగులు ఆ బాలికను వేరే వ్యక్తికి లక్షరూపాయలకు అమ్మివేశారు. ఆ బాలిక చాకచక్యంగా తప్పించుకుని ఇంటికి చేరింది. ఆలస్యంగా వెలుగుచూసిన  ఈ అమానుష సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మరకోట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన మంగళ సింగ్‌ హరిజన్, మొణిత కుమార్‌లు సునాబెడ గ్రామానికి చెందిన బాలికకు పనులు ఇప్పిస్తామని తల్లి దండ్రులను ప్రలోభపెట్టి గత ఏడాది ఆగస్టు 8 వ తేదీన తమతో నవరంగపూర్‌ తీసుకువెళ్లారు. నవరంగపూర్‌లోని తోటవీధికి చెందిన నిర్మల సున, బసంత సున, జమున బాగ్, పూర్ణశాంత అనే మహిళలకు బాలికను అప్పగించి వెళ్లిపోయారు.

ఆ బాలిక దాదాపు 3 నెలలు అక్కడే ఉంది. అనంతరం ఆ మహిళలు బాలికను ఢిల్లీ తీసుకు వెళ్లి ఒక వ్యక్తితో వివాహం చేశారు. ఆ వ్యక్తి నిందిత మహిళలకు లక్షరూపాయలు అందజేశాడు. డబ్బులు చేతికి అందిన తరువాత నిందిత మహిళలు నవరంగపూర్‌ తిరిగి వచ్చేశారు. ఆ వ్యక్తి వేధింపులు తాళలేక ఈ నెల 14 వ తేదీన బాలిక  తప్పించుకుని అతి కష్టంపై ఉమ్మరకోట్‌ చేరుకుంది. ఈ విషయం తెలిసిన నిందిత మహిళలు ఈ నెల 21వ తేదీన బాలిక గ్రామానికి వచ్చి ఢిల్లీ తీసుకు వెళ్తామని, తమతో రమ్మని బలవంతం పెట్టారు. వారితో వెళ్లేందుకు బాలిక నిరాకరించి తనను లక్ష రూపాయలకు అమ్మివేశారని తల్లిదండ్రులకు వెల్లడించింది. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు అవాక్కయ్యారు. నిందితులపై ఆగ్రహించి బంధించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ అమానుష సంఘటన జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది.  

చదవండి: ప్రియురాలి యాసిడ్‌ దాడి, ప్రియుడి మృతి

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)