రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మ్యాట్రిమోనీలో పరిచయం.. సహజీవనం చేసి.. కోరిక తీర్చుకుని..
Published on Sun, 11/21/2021 - 18:21
కర్నూలు(హాస్పిటల్): మ్యాట్రిమనీ వెబ్సైట్లో పరిచయమైన వ్యక్తి రెండు నెలల పాటు సహజీవనం చేయడంతో పాటు బంగారు, నగదుతో ఉడాయించిన సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. స్థానిక బాలా జీనగర్కు చెందిన ఓ మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదించి ఆమె విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఓ మ్యాట్రిమనీలో తన వివరాలను అప్లోడ్ చేసింది.
చదవండి: వృద్ధుడి పైశాచికం.. కామంతో కళ్లు మూసుకుపోయి..
ఈ వివరాలను చూసిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తాను రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఆమెను నమ్మించాడు. రెండు నెలల పాటు కర్నూలులోనే ఆమెతో పాటు ఉన్నాడు. ఇటీవల ఆమె వద్ద 8 తులాల బంగారు, రూ.2లక్షల నగదు తీసుకుని ఉడాయించాడు. దీంతో ఆ మహిళ జరిగిన మోసంపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
#
Tags