amp pages | Sakshi

రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా

Published on Thu, 01/27/2022 - 09:55

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కడుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు మరో లిమిటెడ్‌ సంస్థకు చెందిన పనులు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన ముఠాపై హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.579 కోట్ల పనులు సబ్‌–కాంట్రాక్ట్‌కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన సివిల్‌ ఇంజినీర్‌ కె.జగదీశ్వర్‌ దాదాపు పదహారేళ్లుగా సాయిడక్స్‌ ఇంజినీర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. శివప్రసాద్‌ అనే దళారి ద్వారా ఈయనకు గతేడాది సెప్టెంబర్‌ 21న డీఎన్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.నరేష్‌ చౌదరి కలిశారు.

ఆ సందర్భంలో మహానంది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన రూ.539 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ చూపించారు. ఆ కాంట్రాక్టు తనకే వచ్చిందంటూ నమ్మబలికాడు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించిన రూ.40 కోట్ల కాంట్రాక్టునూ సబ్‌–కాంట్రాక్టుకు ఇస్తానంటూ చెప్పాడు. బేరసారాల తర్వాత జగదీశ్వర్, నరేష్‌లు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నరేష్‌ నుంచి జగదీశ్వర్‌కు ఆ రెంటితో సంబంధం లేని పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నిస్తే జీఎస్టీ ఇబ్బందుల నేపథ్యంలో అలా ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పాడు.
చదవండి: యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?

గరిష్టంగా వారం రోజుల్లో అసలు పనులు ప్రారంభిద్దామంటూ అందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం కావాలంటూ రూ.1.4 కోట్లు తీసుకున్నాడు. ఈ నగదు తీసుకునే సమయంలో నరేష్‌తో పాటు అతడి భార్య లావణ్య, బంధువు రాకేష్‌లతో పాటు చైతన్య అనే వ్యక్తి కూడా వచ్చారు. ఆపై సరుకు సరఫరా పేరుతో ఉమా ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, ఏకదంత రిటైలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు రూ.50 లక్షలు, రూ.1.1 కోట్లు చొప్పున నగదు, పర్చేజ్‌ ఆర్డర్లు ఇప్పించాడు. ఈ చెల్లింపుల తర్వాత జగదీశ్వర్‌కు ఎలాంటి సరుకు సరఫరా కాలేదు. కొన్నాళ్లు ఎదురు చూసిన ఈయన తన సబ్‌–కాంట్రాక్టులు, నగదు విషయంపై నరేష్‌ను సంప్రదించారు.

అయితే అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించారు. దీంతో ఆరా తీయగా... నరేష్‌ నేతృత్వంలోని ముఠా అనేక మందిని ఇదే పంథాలో మోసం చేసిందని, దాదాపు ప్రతి సందర్భంలోనూ నకిలీ లెటర్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌లు చూపించినట్లు తేలింది. దీంతో ఆయన సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నరేష్, లావణ్య, రాకేష్, స్వాతి, చైతన్య, శివప్రసాద్‌లతో పాటు ఉమా ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, ఏకదంత రిటైలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Videos

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)