amp pages | Sakshi

రాని కరోనాను రప్పించి మరీ..

Published on Tue, 02/08/2022 - 10:41

కోవిడ్‌ బారినపడ్డ వారికోసం ప్రవేశపెట్టిన బీమా పథకంపై కొందరు కన్నేశారు. పది మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రెండు గ్రామాల్లో వందల మందిని తీసుకెళ్లి బీమా చేయించారు. తర్వాత వారికి కరోనా వచ్చినట్టుగా, ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు తీసుకున్నట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు సంపాదించారు. వాటిని సమర్పించి బీమా సొమ్ము క్లెయిమ్‌ చేయించడం మొదలుపెట్టారు. రూ.2.25 కోట్లదాకా వెనకేశారు. అనుమానం వచ్చిన బీమా సంస్థ రంగంలోకి దిగడంతో.. అసలు బాగోతం బయటపడింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో జరిగిన ఈ వ్యవహారం సంచలనంగా మారింది. 

కారేపల్లి: ఎవరైనా కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వస్తే.. ఆ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సంస్థలు కరోనా బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. అదే క్రమంలో ఎస్‌బీఐ లైఫ్‌ కరోనా రక్షక్‌ పేరుతో పాలసీని ప్రవేశపెట్టింది. అందులో రూ.5వేలు ప్రీమియం కడితే రూ.2.5 లక్షల బీమా ఉంటుంది. అయితే కోవిడ్‌ సోకి ఆస్పత్రిలో కనీసం మూడు రోజులపాటు చికిత్స తీసుకున్నవారికే ఈ సొమ్ము అందుతుంది. ఈ బీమా సొమ్మును కొల్లగొట్టేందుకు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీ, దాని శివారు గ్రామం మేకలతండాకు చెందిన పది మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు.

ఈ రెండు గ్రామాల్లో కలిపి 1,200 మంది వరకు జనాభా ఉండగా.. ఏకంగా 800 మందిని గతేడాది సెప్టెంబర్‌లో కారేపల్లికి తీసుకెళ్లి ‘ఎస్‌బీఐ లైఫ్‌ కరోనా రక్షక్‌’పథకం కింద బీమా చేయించారు. ఆ సమయంలో ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ఇన్సూరెన్స్‌ కోసం, మిగతా సొమ్ము తప్పుడు సర్టిఫికెట్ల కోసం ఖర్చవుతుందని చెప్పారు. బీమా సొమ్ము రూ.2.5 లక్షలు ఖాతాల్లో జమకాగానే సదరు వ్యక్తులు రూ.లక్ష ఉంచేసుకుని, మిగతా రూ.1.5 లక్షలు తమకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.10వేలు ఖర్చుపెడితే.. లక్ష రూపాయలు వస్తాయన్న ఆశతో చాలా మంది ముందుకొచ్చారు. 

ఆస్పత్రుల నుంచి బిల్లులు సంపాదించి.. 
ముఠా సభ్యులు స్థానిక పీహెచ్‌సీలోనైతే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో పక్కనే ఉన్న గార్ల పీహెచ్‌సీ నుంచి సుమారు 500 మందికి తప్పుడు కరోనా పాజిటివ్‌ సర్టిఫికెట్లు సంపాదించారు. తర్వాత వీరంతా ఖమ్మంలోని వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మూడు రోజులకుపైన చికిత్స పొందినట్లు తప్పుడు బిల్లులు సంపాదించారు. ఆస్పత్రుల్లో సిబ్బందికి సొమ్ము ఆశచూపి మేనేజ్‌ చేశారు. ఆ తప్పుడు పత్రాల సాయంతో బీమా సొమ్ము కోసం దరఖాస్తులు చేయించారు. బీమా సంస్థ ఇటీవల 90 మంది క్లెయిమ్‌లను అంగీకరించి.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2.5 లక్షల చొప్పున మొత్తంగా రూ.2.25 కోట్ల మేర జమచేసినట్టు తెలిసింది. 

భారీ క్లెయిమ్‌లపై అనుమానంతో.. 
ఒకే ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్కువగా పాజిటివ్‌ సర్టిఫికెట్లు ఉండడం, రెండు గ్రామాల నుంచే ఇంత భారీగా సొమ్ము కోసం క్లెయిమ్‌లు వస్తుండటంతో.. బీమా సంస్థ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఈ విషయం బయటికి వచ్చి, స్థానికంగా చర్చనీయాంశం కావడంతో.. సదరు ముఠా సభ్యులు మిగతావారితో క్లెయిమ్‌ చేయించడాన్ని ఆపేసినట్టు సమాచారం.

మూడు వేవ్‌లలో కలిపి పాజిటివ్‌లు 280 మాత్రమే.. 
రెండు గ్రామాల్లో కరోనా కేసుల విషయమై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా.. ఇప్పటివరకు మూడు వేవ్‌లలో కలిపి 280 వరకు మాత్రమే పాజిటివ్‌ కేసులు వచ్చి ఉంటాయని తెలిపారు. అంతకుమించి కేసులు నమోదుకాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా 800 మందికి కరోనా పాజిటివ్‌ సర్టిఫికెట్లు రావడం, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తప్పుడు బిల్లులు అందడం వెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వస్తోంది. 

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)