జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం
Published on Sun, 08/23/2020 - 14:21
సాక్షి, చెన్నై : చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబేడు ప్రైవేట్ బస్సులు నిలిపే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న బస్సులకు మంటలు అంటుకున్నాయి. బస్సులన్నీ పక్కపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఇప్పటి వరకు మూడు బస్సులు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.
#
Tags