amp pages | Sakshi

కోవిడ్‌ దెబ్బకు క్రిమినల్‌ అవతారం

Published on Tue, 11/10/2020 - 08:44

సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేసే వారి జీవితాల్లో మరో దయనీయ కోణమూ ఉంది. తమ జీతంపై ఆశతో అనేక మంది అప్పులు చేస్తున్నారు. కోవిడ్‌ వంటి వాటితో పరిస్థితులు తల్లకిందులైతే దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. అలాంటి వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, నేరగాళ్లుగా మారడం జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణే హేమంత్‌కుమార్‌ వ్యవహారం. మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్న ఇతగాడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.  బెంగళూరుకు చెందిన హేమంత్‌కుమార్‌ ఉన్నత విద్యనే అభ్యసించాడు. చాన్నాళ్లు అక్కడి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఎథికల్‌ హ్యాకర్‌గా పని చేశాడు. ఆ సమయంలో ప్రతి నెలా ‘ఐదంకెల’ జీతం అందుకున్న హేమంత్‌కుమార్‌ దానికి తగ్గట్లే తన లైఫ్‌ను ప్లాన్‌ చేసుకున్నాడు.  ప్రతి నెలా వచ్చే జీతంలో తన ఖర్చులు పోగా.. ఎక్కువ మొత్తమే మిగిలేది. దీంతో దాదాపు ఐదేళ్లు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు మరికొంత మొత్తం రుణం తీసుకుని బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీలో ఓ ఫ్లాట్‌ కొన్నాడు. కొన్నాళ్ల పాటు ఈఎంఐల చెల్లింపు సజావుగానే సాగింది.  కోవిడ్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో అనేక మంది సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన వారి మాదిరిగానే అతడు సైతం ఇబ్బంది పడ్డాడు.

హఠాత్తుగా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు. కొత్తగా ఖరీదు చేసిన ఫ్లాట్‌కు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేని స్థితికి చేరాడు.  తన కష్టార్జితంతో పాటు రుణం తీసుకుని ఖరీదు చేసిన ఆ ఫ్లాట్‌ బ్యాంకు వారి పరం అవుతుందని భయపడ్డాడు. దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించడంతో పాటు పనిలో పనిగా తన ఖర్చుల కోసమూ మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌ మొదలెట్టాడు.  పలు మాట్రిమోనియల్‌ సైట్స్‌లో తన పేరు, వివరాలను రిజిస్టర్‌ చేసుకున్నాడు. అందులో ఉన్న యువతుల ప్రొఫైల్స్‌లో కొన్నింటిని ఎంపిక చేసుకునే వాడు. వారికి సందేశాలు పంపుతూ వివాహం చేసుకోవడానికి సమ్మతమని చెప్పేవాడు.  తాను బెంగళూరులో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పరిచయం చేసుకునే వాడు. తన వల్లోపడిన వారితో కొన్నాళ్లు చాటింగ్, ఫోన్‌ కాల్స్‌ కొనసాగించేవాడు. ఆపై అసలు కథ మొదలెట్టే హేమంత్‌కుమార్‌ తనకు అత్యవసరమనో, తల్లిదండ్రులకు ఆనారోగ్యమనో ఆ యువతితో చెప్పేవాడు.  ఆ కారణంతో ఆమె నుంచి అందినకాడికి తీసుకుని దండుకుని ఆపై మోసం చేసేవాడు.

కొన్నిసార్లు తన ఫోన్‌ నెంబర్‌ మార్చేయగా.. మరి కొన్నిసార్లు ఎదుటి వారివి బ్లాక్‌ చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది యువతులు మిన్నకుండిపోయాడు.  బెంగళూరుకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో అక్కడి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన ఇతగాడు నెల కూడా సక్రమంగా ఉండలేదు. మరో పేరులో మరో మాట్రిమోనియల్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాడు. హుబ్లీ చెందిన యువతిని మోసం చేయడంతో ఆమె అక్కడ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన మరో యువతి నుంచి కూడా హేమంత్‌కుమార్‌  రూ.2.1 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో హేమంత్‌కుమార్‌పై నగరంలో  కేసు నమోదైంది.  దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌