amp pages | Sakshi

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌.. దేశంలో తొలిసారి

Published on Mon, 12/27/2021 - 10:38

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టణాలకే పరిమితం చేయకుండా పంట పొలాల్లోని ఉత్పత్తులకు ఉపయోగపడేలా కొత్త విధానం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. 

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ప్రవేశపెట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నగరానికి చెందిన నెబ్యూలా అనే సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పారదర్శకంగా చేపట్టేందుకు వీలుగా ఏఐని ఉపయోగించనున్నారు. 

ధాన్యాన్ని నలిపేసి
ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారం అంతా మాన్యువల్‌ పద్దతిలోనే జరుగుతుంది. కొనుగోలు అధికారులు మార్కెట్‌లో రైతుల పండించిన ధాన్యాన్ని చేతిలో తీసుకుని నలపడం ద్వారా అందులో తేమ ఎంత ఉంది. చిన్న సైజువా పెద్ద సైజువా ఇలా అనేక అంశాలను బేరీజు వేసి తుది నిర్ణయానికి వస్తున్నారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని అనుసరించి ధాన్యానికి రేటు నిర్థారణ జరుగుతుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేదనే విమర్శలతో పాటు వేగం కూడా తక్కువగా ఉంది.

ఏఐ సాయంతో
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ విధానంలో శాంపిల్‌ ధాన్యాన్ని ట్రేలో పోసిన తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మెషిన్‌ ఆ ధాన్యాన్ని పరిశీలిస్తూ 360 డిగ్రీస్‌లో ఫోటోలు తీస్తుంది. అనంతరం ఆ సమాచారన్ని విశ్లేషించి. సదరు ధాన్యంలో ఎంత మోతాదు తేమ ఉంది. పరిణామం, వ్యాకోచం వంటి వివరాలతో పాటు ఆ పంట ఆర్గానిక్‌ లేదా రసాయనాలు ఉపయోగించి పండించినదా అనే వివరాలను క్షణాల్లో తెలియజేస్తుంది. ఈ విధానంలో వేగం పెరగడంతో పాటు పారదర్శకత కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ముందుగా ఇక్కడే
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏఐ వినియోగాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా మూడు కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నారాయణపేట, కామరెడ్డిలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంపిక కాగా మరొకదాన్ని ఫైనల్‌ చేయాల్సి ఉంది. ఈ కొనుగోలు కేంద్రాల్లో కంది, శనగ, వరి ధాన్యాల  కొనుగోలు సందర్భంగా ఏఐని వినియోగించాలని నిర్ణయించారు. 

మిగిలిన వాటికి 
పైలట్‌ ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేవలం ధాన్యం కొనుగోలుకే కాకుండా పండ్లు ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు లోనూ ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ వినియోగం పెంచాలనే యోచనలో ఉంది.

చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్‌ మోడ్‌ వాహనం

Videos

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)