amp pages | Sakshi

ఇంటర్నెట్‌ స్పీడ్‌ సమస్యలకు పరిష్కారం... ఎల్‌ఈవో

Published on Tue, 08/10/2021 - 13:21

ఇండియాలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీపై కార్పోరేట్‌ కంపెనీలు కన్నేశాయి. వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ అందించేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో బడా కంపెనీలో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సెక్టార్‌లో అడుగుపెడుతోంది. 

టాటా విత్‌ టెలిశాట్‌
టాటా గ్రూప్‌కి చెందిన నెల్కో సంస్థ కెనాడుకు చెందిన టెలిశాట్‌ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ డీల్‌ కుదిరితే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను ఇండియాలో అందివ్వనున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 2024 నాటికి ఇండియాలో వైర్‌లెస్‌ పద్దతిలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కనెక్టివిటీ సమస్య
జియోరాకతో ఇండియాలో ఇంటర్నెట్‌ వాడకంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అర్బన్‌ ఏరియాలో ఇంటర్నెట్‌ నిత్య జీవితంలో ఒక భాగమైంది. వ్యక్తిగత అవసరాలతో పాటు ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ అనేది తప్పనిసరిగా మారింది. అయితే  రూరల్‌ ఇండియాలో పరిస్థితి ఇందుకు భిన​ంగా ఉంది. దేశంలో సగానికి పైగా ఏరియాల్లో అసలు ఇంటర్నెట్‌ కనెక‌్షన్లు లేవు. ఉన్నా నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంది. లైట్‌ స్పీడ్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తే నెట్‌ స్పీడ్‌ సమస్యలు తీరే అవకాశం ఉంది. డిజిటటీకరణ మరింత వేగం పుంజుకోనుంది.

ఎల్‌ఈవో
ప్రస్తుతం  నెట్‌ ఫైబర్‌ వైర్‌, స్పెక్ట్రమ్‌, శాటిలైట్‌ల ద్వారా  ఇంటర్నెట్‌ పని చేస్తోంది. మన దేశంలో మొబైల్‌ నెట్‌వర్క్‌లు స్పెక్ట్రమ్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తుండగా ప్రైవేటు కంపెనీలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో ఫైబర్లు ఆప్టికల్‌ ఫైబర్‌ వైర్‌ ద్వారా నెట్‌ అందిస్తున్నాయి. ఈ రెండు కాకుండా భూమి నుంచి 500ల నుంచి 2,000 కి.మీ ఎత్తులో ఉండే ఉపగ్రహం (లో ఎర్త్‌ ఆర్బిట్‌) ద్వారా లైట్‌ స్పీడ్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందివ్వడం వీలవుతుంది. 1990ల నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కమర్షియల్‌గా ఉపయోగించలేదు. ప్రస్తుతం నెట్‌ వినియోగం పెరిగిపోవడంతో ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. సెల్‌ టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యవస్థ లేని చోట కూడా శాటిలైట్‌ ద్వారా నెట్‌ అందివ్వడం ఈ పద్దతిలో సాధ్యం అవుతుంది. 

వచ్చే ఏడాది
లో ఎర్త్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌ కనెక్టివిటీ కోసం టెలిశాట్‌ సంస్థ ఏకంగా ఎనిమిది బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇండియాకు సంబంధించి ఈ సంస్థ టాటా గ్రూపుకి చెందిన నెల్కోతో కలిసి పని చేయనుంది. టాటా కంటే మేందు ఎయిర్‌టెల్‌ సంస్థ సైతం శాటిలైట్‌ ఇంటర్నెట్‌పై దృష్టి సారించింది. ఈ విభాగంలో వన్‌వెబ్‌ సంస్థతో కలిసి పని చేస్తోంది. మరోవైపు అమెజాన్‌ , టెస్లాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థలు కూడా లైట్‌ స్పీడ్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను వచ్చే ఏడాది నుంచి వైర్‌లెస్‌ నెట్‌ సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
 

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)