జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
వరుసగా రెండో రోజూ లాభాల జోరు
Published on Tue, 03/02/2021 - 10:15
సాక్షి, ముంబై: వరుసగా రెండోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. అమెరికా మార్కెట్లు జోరుతో దేశీయకీలక సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన కొనసాగుతున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 566 పాయింట్లుఎగిసి 50,415 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు లాభంతో 14,927వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా, బ్యాంక్ నిఫ్టీలు అరశాతం పైగా లాభంతో, నిఫ్టీ ఐటీ ఒకశాతం లాభంతో కొనసాగుతోన్నాయి. బీపీసీఎల్, ఐవోసీఎల్, బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో షేర్లు నష్టపోతున్నాయి.
#
Tags