amp pages | Sakshi

సెన్సెక్స్‌కు లాభాలు.. నిఫ్టీకి నష్టాలు..!

Published on Sat, 02/13/2021 - 06:18

ముంబై: చివరి అరగంటలో బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో  శుక్రవారం సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 544 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 13 పాయింట్ల స్వల్ప లాభంతో 51,544 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయి సూచీకి ఆల్‌టైం హై విశేషం. అలాగే ట్రేడింగ్‌లో 162 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ ఇండెక్స్‌ 10 పాయింట్ల పరిమిత నష్టంతో 15,163 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మీడియా రంగాల షేర్లు నష్టపోయాయి. ‘‘డిసెంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి, జనవరి ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. మరోవైపు మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడం మార్కెట్‌   సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రతికూలాంశాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు’’ అని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు తెలిపారు. ఈ వారంలో సెన్సెక్స్, 812 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 239 పాయింట్లు   పెరిగింది.

ఉదయం సెషన్‌లో లాభాలు  
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల ఆకర్షణీయమైన క్యూ3 ఆర్థిక గణాంకాలను ప్రకటిస్తున్న కంపెనీల షేర్లు రాణించాయి. దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం తిరిగి ప్రారంభం కావడం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో అన్ని రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 273 పాయింట్లు లాభపడి 51,804 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 15,243 వద్ద ఇంట్రాడే హైని అందుకుంది.

మిడ్‌ సెషన్‌లో అనూహ్య అమ్మకాలు  
అంతా సజావుగా సాగుతున్న తరుణంలో మిడ్‌సెషన్‌లో బ్రిటన్‌ ఎకానమీపై ప్రతికూల వార్తలు  వెలువ డటంతో యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. ఫలి తంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం నుంచి 544 పా యింట్లు, నిఫ్టీ 162 పాయింట్లను నష్టపోయాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌