amp pages | Sakshi

నష్టాల కంపెనీలకు సెబీ షాక్...!

Published on Sat, 02/19/2022 - 08:09

న్యూఢిల్లీ: నష్టాలు నమోదు చేస్తూ పబ్లిక్‌ ఇష్యూలకు వస్తున్న కంపెనీలను కట్టడి చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. దీనిలో భాగంగా ఆయా కంపెనీలు ఇకపై ఐపీవోల కోసం దాఖలు చేసే ప్రాస్పెక్టస్‌లో మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ అంశాలపై సవరించిన తాజా ప్రతిపాదనలను కన్సల్టేషన్‌ పేపర్‌ ద్వారా సెబీ ప్రజల ముందుంచింది. వీటిపై మార్చి 5లోగా అభిప్రాయ సేకరణను పూర్తిచేయనుంది. ఇటీవల పలు ఆధునిక తరం టెక్నాలజీ కంపెనీలు నష్టాలు నమోదు చేస్తూ పబ్లిక్‌ ఇష్యూలకు వస్తున్న సంగతి తెలిసిందే. నష్టాలు సాధిస్తున్న కంపెనీలు పనితీరుకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలను ప్రాస్పెక్టస్‌లో వెల్లడించవలసి ఉంటుంది.

ప్రాస్పెక్టస్‌ ఇలా..
నష్టాలు నమోదు చేస్తున్న కంపెనీలు ప్రాస్పెక్టస్‌లో ఐపీవో ధర నిర్ణాయక ప్రాతిపదికను తెలియజేయవలసి ఉంటుంది. దీంతోపాటు కొత్త షేర్ల జారీ, అంతక్రితం 18 నెలల్లో కొనుగోలు చేసిన షేర్లకి సంబంధించిన విలువ నిర్ధారణపైనా వివరాలు అందించవలసి ఉంటుంది. కనీసం గత మూడేళ్లలో నిర్వహణ లాభాలు ఆర్జించని ఆధునిక తరం టెక్నాలజీ కంపెనీలు ఇటీవల పబ్లిక్‌ ఇష్యూలు చేపడుతున్న విషయం విదితమే. ఇలాంటి సంస్థలు సహజంగానే తొలినాళ్లలో లాభాలు ఆర్జించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కస్టమర్లను పొందడంపై దృష్టిపెడుతున్నాయి. తద్వారా కార్యకలాపాల విస్తరణకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఈ కంపెనీలు నష్టాలు నమోదు చేయడమేకాకుండా బ్రేక్‌ఈవెన్‌(లాభనష్టాలులేని) పరిస్థితి సాధించేందుకు దీర్ఘకాలం వేచిచూడవలసి వస్తోంది.  


సవరణలు ఇలా
ఇప్పటివరకూ పబ్లిక్‌ ఇష్యూ ధర నిర్ణయంలో కంపెనీ ఖాతాల ఈపీఎస్, నెట్‌వర్త్, ఎన్‌ఏవీ, పోటీ సంస్థలతో పోలిక వంటి కీలక అంశాలను పొందుపరిచేందుకు వీలుగా ప్రాస్పెక్టస్‌ను రూపొందిస్తున్నారు. సెబీ అభిప్రాయం ప్రకారం ఇవి లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలకు మాత్రమే అనువుగా ఉంటున్నాయి. నష్టాలు నమోదు చేస్తున్న కంపెనీలు తగిన వివరాలు పొందుపరిచేందుకు అనువుగా ఉండటంలేదు. దీంతో ‘ఇష్యూ ధర నిర్ధారణకు ప్రాతిపదిక’ పేరిట తగిన వివరాలు ఇచ్చేలా ప్రాస్పెక్టస్‌కు రూపకల్పన చేసింది. గత లావాదేవీలు, నిధుల సమీకరణ, షేర్ల జారీలో కంపెనీ విలువ మదింపు తదితర కీలక వివరాలను అందించవలసి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ గత మూడేళ్ల పనితీరుకు సంబంధించిన వివరాలు సైతం సమగ్రంగా దాఖలు చేయవలసి ఉంటుంది. వెరసి ఇష్యూ ధర నిర్ణయంలో ఇవి ఏవిధంగా ప్రభావం చూపినదీ వెల్లడించలసి ఉంటుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)